Lok sabha poll results: జూన్ 4 తర్వాత నిఫ్టీ 23 వేల మార్కు దాటనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లకు మంచి రోజులు రాబోతున్నాయా? మార్కెట్ సూచీలు పరుగులు పెట్టబోతున్నాయా? అంటే సూచనలు అలానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అయితే దేశంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారం ఛేజిక్కించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత మే 25న జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ల సూచీలు పరుగులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
బుధవారం స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ 23,000 మార్కుకు చేరువలో ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మూడోసారి మోడీనే ప్రధాని కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 4 తర్వాత నిఫ్టీ 23 వేల మార్కు దాటడం ఖాయమని నివేదిక అందుతోంది. బుధవారం నిఫ్టీ 50 పాయింట్ల లాభపడి 22,597.8 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇది త్వరలోనే 23 వేల మార్కు దాటడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: RBI Dividend: 2.11 లక్షల కోట్ల డివిడెండ్ కు ఆర్బీఐ ఆమోదం..
2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నిఫ్టీని 23,000 దాటి పోయే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ బెర్న్స్టెయిన్ తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్ సైక్లికల్, ఫైనాన్షియల్లు లాభాల్లో పయనించవచ్చని వెల్లడించింది. ఐటీ స్టాక్లు మాత్రం వెనుకబడి ఉండవచ్చని బెర్న్స్టెయిన్ ఒక నివేదికలో పేర్కొంది. స్మాల్ మరియు మిడ్ క్యాప్స్ కొన్ని రోజులు లార్జ్ క్యాప్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయని పేర్కొంది. తాజా పరిణామాలను అంచనా వేసి ఈ నివేదిక రూపొందించినట్లు బెర్న్స్టెయిన్ తెలిపింది.
భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. ఆసియా దేశాలను ఇండియా అధిగమిస్తుందని నివేదికలో పేర్కొంది. మౌలిక సదుపాయాలు కల్పించడం, తయారీ రంగాన్ని పోత్సహించడం, ఆచరణీయమైన ఎగుమతి ఫ్రాంచైజీని నిర్మించడం అవసరం అని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ తెలిపింది. ఇక బీజేపీ 330-350 సీట్లు సాధించొచ్చని తెలిపింది.
ఇది కూడా చదవండి: Pawan singh: భోజ్పురి నటుడు, సింగర్ పవన్ సింగ్పై బీజేపీ వేటు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!