ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో నమోదైన అత్యంత భారీ స్కోర్లు ఇవే
- ఛాంపియన్స్ ట్రోఫీలో నమోదైన అత్యంత భారీ స్కోర్లు.
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ విధ్వంసం.
- ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 362 నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Champions Trophy: లాహోర్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై 362/6 పరుగుల భారీ స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. నేడు (2025 మార్చి 5)న జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెన్సేషన్ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (49*) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు అత్యధిక స్కోరును నమోదు చేయగలిగింది. మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (ICC Champions Trophy) ఇప్పటివరకు నమోదైన అత్యంత భారీ స్కోర్లపై ఒక లుక్ వేద్దామా..
Read Also: NZ vs SA Semifinal: రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సెంచరీలు.. భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు కూడా ఇదే టోర్నమెంట్లో నమోదైంది. ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్పై 356/5 పరుగులు చేయడంతో ఇది రెండవ స్థానంలో నిలిచింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అదే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 351/8 పరుగులు చేసి మూడవ స్థానంలో నిలిచింది. 2004 సెప్టెంబర్ 10న జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు అమెరికా జట్టుపై 347/4 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా 2017 జూన్ 18న పాకిస్థాన్ జట్టు భారత జట్టుపై 338/4 పరుగులు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత 2013 జూన్ 6న కార్డిఫ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 331/7 పరుగులు చేయగా, 2025 ఫిబ్రవరి 26న లాహోర్లో ఇంగ్లాండ్పై ఆఫ్గానిస్తాన్ జట్టు 325/7 పరుగులు చేసి అత్యధిక స్కోర్ల జాబితాలో చోటు సంపాదించాయి. అలాగే 2009 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై సెంటూరియన్లో 323/8 పరుగులు చేయగా, 2017 జూన్ 8న శ్రీలంక జట్టు భారత జట్టుపై 322/3 పరుగులతో విజయం సాధించింది. అదే మ్యాచ్లో భారత్ జట్టు శ్రీలంకపై 321/6 పరుగులు చేసినప్పటికీ ఆ మ్యాచ్లో భారత్ జట్టు ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!