VC Sajjanar : న్యూ ఇయర్ వినోదం.. కారాదు విషాదం..
- కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు పలు కీలక సూచనలు చేసిన వీసీ సజ్జనార్
- కొత్త సంవత్సరం వేడుకలను మీ కుటుంబ సభ్యులతో మీ ఇళ్లలోనే జరుపుకోండి
- ప్రమాదాల నుంచి దూరంగా, సంతోషకరంగా ఉండండి : వీసీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar : టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా, సురక్షితంగా ప్రారంభించేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఆహ్వానం ప్రజల్లో చైతన్యాన్ని పెంచే విధంగా ఉంది.
“కొత్త సంవత్సరం వేడుకలను మీ కుటుంబ సభ్యులతో మీ ఇళ్లలోనే జరుపుకోండి. ప్రమాదాల నుంచి దూరంగా, సంతోషకరంగా ఉండండి. గతంలో కొత్త సంవత్సరం వేడుకల పేరుతో జరిగిన విషాదాలను గుర్తుంచుకుని, అలాంటి దుస్థితులను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సజ్జనార్ స్పష్టంగా తెలియజేశారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
విశేషంగా, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను ప్రస్తావిస్తూ, “మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణనష్టానికి కారణం అవుతుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించే ఆచరణ ఇది. కనుక, న్యూ ఇయర్ వేడుకలలో బాధ్యతగా వ్యవహరించండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Isha: 75 ఏళ్ల అమ్మమ్మ త్రోబాల్ ఆట.. ఘనంగా 16వ ఈశా గ్రామోత్సవం
అంతేకాక, సజ్జనార్ బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర కార్యక్రమాలపై కూడా సీరియస్గా స్పందించారు. “ఎంజాయ్ పేరుతో చేసే బైక్ రేసింగ్లు అత్యంత ప్రమాదకరమైనవి. అటువంటి ఆటవిక చర్యలు చేయడం వల్ల మీరు మీ ప్రాణాలకు గానీ, ఇతరుల ప్రాణాలకు గానీ ముప్పు తలపెట్టవద్దు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు,” అని హెచ్చరించారు.
సజ్జనార్ ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సరాన్ని రోడ్డు ప్రమాదరహితంగా, సురక్షితంగా జరుపుకునే అవసరాన్ని గుర్తు చేస్తోంది. “కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా ప్రారంభించి, బాధ్యతాయుతంగా నడుచుకోండి. మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ, మీ భవిష్యత్తు కోసం రక్షణా చర్యలు తీసుకోండి” అని ఆయన సూచించారు. ఈ కొత్త సంవత్సరం, సజ్జనార్ సూచించిన మేరకు ప్రతి ఒక్కరూ హితచింతకులుగా వ్యవహరిస్తారని ఆశిద్దాం!
CM Chandrababu: గ్రామస్తులతో ముఖాముఖి.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!