NTV Telugu Site icon

Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!

Dj Siddu

Dj Siddu

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. DJ సిద్ధార్థతో సహా మరో వ్యక్టి కొకైన్ & గంజాయి సేవించినట్లుగా నార్కోటిక్స్ బ్యూరో నిర్ధారణ చేసింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మాదాపూర్ & గచ్చిబౌలి పబ్ లో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని ఎన్సీబీ పిలిపించి పరీక్షలు నిర్వహించింది. యూరిన్ బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల రిపోర్టులో వెల్లడైంది. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో U/s. 27 NDPS చట్టం, 1985 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: NTR :దేవర షూటింగ్ కు ఫ్యామిలీ తో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..

ఇక, పబ్స్ దగ్గర డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు నిఘా పెట్టారు. పబ్బుల వద్ద డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో నార్కోటిక్ బ్యూరో అధికారులు పరీక్షలు నిర్వహించారు. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తి స్వరూప్ ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ కదలికలపై ఫోకస్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రక్స్ కేసులో ఇంక ఎవరెవరికి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.