Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?
- వచ్చే ఏడాది హజ్ యాత్రలో చాలా మార్పులు
- కొత్త నిబంధనలు.. మార్పులు తీసుకొచ్చిన సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రధానంగా వయస్సు మార్పు
- రిజర్వ్ కేటగిరీ వయస్సు 70 నుండి 65 సంవత్సరాలకు తగ్గింపు
- హజ్ యాత్రకు వచ్చిన భార్యాభర్తలు కలిసి ఒకే గదిలో ఉండకూడదనే పరిమితి విధింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది హజ్ యాత్రలో చాలా మార్పులు కనిపించబోతున్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు జారీ చేసిన మినహాయింపులను రద్దు చేసింది. అందులో ప్రధానంగా వయస్సు మార్పు. ఇందులో రిజర్వ్ కేటగిరీ వయస్సు 70 నుండి 65 సంవత్సరాలకు తగ్గించారు. మరొకటి.. హజ్ యాత్రకు వచ్చిన భార్యాభర్తలు కలిసి ఒకే గదిలో ఉండకూడదనే పరిమితి విధించింది. వారు వేర్వేరు గదుల్లో బస చేయాల్సి ఉంటుందని తెలిపింది.
Read Also: Condom Use: యూరోపియన్ టీనేజర్లలో తగ్గుతున్న కండోమ్ వాడకం.. డబ్యూహెచ్ఓ ఆందోళన..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
హజ్ తీర్థయాత్రకు సంబంధించి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను విడుదల చేసింది. కమిటీ ప్రకారం.. హజ్ సమయంలో భారతీయ భార్యాభర్తలు ఒకే గదిలో ఉంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. భార్యాభర్తల మధ్య గదిలో సహజీవనం చేయడం వారి మధ్య విభేదాలకు దారితీస్తుంది. ఇతర దేశాల నుంచి వెళ్లే భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో ఉంటారు. కేవలం భారతీయ భార్యా భర్తలు మాత్రమే కలిసి ఉండేందుకు అనుమతి ఉండేది. కాగా.. ఆ నిబంధనను రద్దు చేశారు. ఈ విషయాన్ని హజ్ కమిటీ అరబ్ ప్రభుత్వానికి తెలియజేసింది.
Read Also: IPL 2025: రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే..!
హజ్ కమిటీ ప్రకారం.. భార్యాభర్తల కోసం గదులు దగ్గర దగ్గరగానే ఉండనున్నాయి. తద్వారా వారు ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. హజ్ యాత్రికుల కోసం వసతి కల్పించే హోటల్లోని ప్రతి అంతస్తులో రిసెప్షన్ ఉంటుంది. ఈ క్రమంలో.. దంపతులు అక్కడ కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం హజ్ కమిటీ హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 9 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు రద్దు చేసింది. అదే సమయంలో 1000 రూపాయలుగా ఉన్న ఫెసిలిటీ లేదా కన్వీనియెన్స్ ఫీజును ప్రభుత్వం రూ. 2 వేలు చేసింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!