New record : పుస్తక విక్రయాల్లో సాహిత్య అకాడమీ కొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New record : టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. ఎన్ని కొత్త రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చినా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గడం లేదు. అందుకు తాత్కారణమే ఈ కథనం. పుస్తకాల అమ్మకంలో సాహిత్య అకాడమీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది రూ.18 కోట్ల 36 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడుపోయినట్లు ప్రకటించింది. ఇది సాహిత్య అకాడమీ చరిత్రలోనే రికార్డు అని స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ పుస్తకాల విక్రయంలో హిందీ, బాల సాహిత్యం ముందంజలో ఉన్నాయి.
సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.కె.కె. శ్రీనివాసరావు గత ఏడాది సాహిత్య అకాడమీ కార్యకలాపాల గురించి తెలియజేస్తూ.. కొంతకాలంగా సాహిత్య అకాడమీ పుస్తకాల విక్రయాలు అకస్మాత్తుగా పెరిగాయని అన్నారు. 2022 సంవత్సరంలో అకాడమీ 18.36 కోట్ల విలువైన పుస్తకాలను విక్రయించిందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా సాహిత్య అకాడమీ శాఖలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి అందిన డేటా ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం పుస్తకాల విక్రయంలో హిందీ పుస్తకాలు, బాలసాహిత్యం అత్యధికంగా ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. సాహిత్య అకాడమీ ఇతర భాషల్లో కూడా బాల సాహిత్య అవార్డులు పొందిన పుస్తకాలను ప్రచురిస్తోందని తెలిపారు. సాహిత్య అకాడమీ రెండేళ్ల క్రితమే బాలసాహిత్యం అనువాద పనులను ప్రారంభించింది.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
Read Also: Dry Cough: పొడి దగ్గుతో నిద్ర పట్టట్లేదా.. పడుకునే ముందు ఇవి తీసుకోండి
కొన్నేళ్ల క్రితం వరకు సాహిత్య అకాడమీ పుస్తకాల వార్షిక విక్రయాల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండేదన్నారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయని ఆయన చెప్పారు. అయితే గత ఏడాది విక్రయాలు ఇప్పటి వరకు ఉన్న అన్ని గణాంకాలను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో సాహిత్య అకాడమీ స్టాల్లో ప్రతిరోజూ రూ.1.25 నుంచి 1.5 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడవుతున్నాయని కార్యదర్శి తెలిపారు. ఇలా మొత్తం ప్రపంచ పుస్తక ప్రదర్శనలో దాదాపు రూ.15 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడుపోయాయి.
ప్రతి 19 గంటలకు కొత్త పుస్తకం
సాహిత్య అకాడమీ కార్యదర్శి మాట్లాడుతూ గత ఏడాది 460 కొత్త పుస్తకాలను అకాడమీ ప్రచురించిందని తెలిపారు. అకాడమీ ఇప్పటివరకు 6000 కంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురించింది. అకాడమీ ప్రతి 19 గంటలకు ఒక పుస్తకాన్ని ప్రచురిస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!