New record : పుస్తక విక్రయాల్లో సాహిత్య అకాడమీ కొత్త రికార్డు
New record : టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. ఎన్ని కొత్త రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చినా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గడం లేదు. అందుకు తాత్కారణమే ఈ కథనం. పుస్తకాల అమ్మకంలో సాహిత్య అకాడమీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది రూ.18 కోట్ల 36 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడుపోయినట్లు ప్రకటించింది. ఇది సాహిత్య అకాడమీ చరిత్రలోనే రికార్డు అని స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ పుస్తకాల విక్రయంలో హిందీ, బాల సాహిత్యం ముందంజలో ఉన్నాయి.
సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.కె.కె. శ్రీనివాసరావు గత ఏడాది సాహిత్య అకాడమీ కార్యకలాపాల గురించి తెలియజేస్తూ.. కొంతకాలంగా సాహిత్య అకాడమీ పుస్తకాల విక్రయాలు అకస్మాత్తుగా పెరిగాయని అన్నారు. 2022 సంవత్సరంలో అకాడమీ 18.36 కోట్ల విలువైన పుస్తకాలను విక్రయించిందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా సాహిత్య అకాడమీ శాఖలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి అందిన డేటా ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం పుస్తకాల విక్రయంలో హిందీ పుస్తకాలు, బాలసాహిత్యం అత్యధికంగా ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. సాహిత్య అకాడమీ ఇతర భాషల్లో కూడా బాల సాహిత్య అవార్డులు పొందిన పుస్తకాలను ప్రచురిస్తోందని తెలిపారు. సాహిత్య అకాడమీ రెండేళ్ల క్రితమే బాలసాహిత్యం అనువాద పనులను ప్రారంభించింది.
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
Read Also: Dry Cough: పొడి దగ్గుతో నిద్ర పట్టట్లేదా.. పడుకునే ముందు ఇవి తీసుకోండి
కొన్నేళ్ల క్రితం వరకు సాహిత్య అకాడమీ పుస్తకాల వార్షిక విక్రయాల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండేదన్నారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయని ఆయన చెప్పారు. అయితే గత ఏడాది విక్రయాలు ఇప్పటి వరకు ఉన్న అన్ని గణాంకాలను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో సాహిత్య అకాడమీ స్టాల్లో ప్రతిరోజూ రూ.1.25 నుంచి 1.5 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడవుతున్నాయని కార్యదర్శి తెలిపారు. ఇలా మొత్తం ప్రపంచ పుస్తక ప్రదర్శనలో దాదాపు రూ.15 లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడుపోయాయి.
ప్రతి 19 గంటలకు కొత్త పుస్తకం
సాహిత్య అకాడమీ కార్యదర్శి మాట్లాడుతూ గత ఏడాది 460 కొత్త పుస్తకాలను అకాడమీ ప్రచురించిందని తెలిపారు. అకాడమీ ఇప్పటివరకు 6000 కంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురించింది. అకాడమీ ప్రతి 19 గంటలకు ఒక పుస్తకాన్ని ప్రచురిస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో