Rajasthan: రాజస్థాన్లో కొత్త చట్టం.. రోడ్డుపై శవంతో నిరసన తెలిపితే రెండేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు ‘రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023’. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది. ఆ బిల్లులో మృతదేహానికి మతం ప్రకారం అంత్యక్రియలు చేసే హక్కు ఇచ్చారు. మృతదేహాలను నిరసన కార్యక్రమాల్లో ఉపయోగిస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించే నిబంధనను రూపొందించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
Also Read
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
అంతేకాకుండా మృతదేహాన్ని నిరసనల్లో ఉపయోగిస్తే.. మృతదేహాన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కు అప్పగిస్తామని ఆ చట్టంలో ఉంది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఉంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మృతదేహం అంత్యక్రియలను 24 గంటల్లో నిర్వహించాలని మృతుల బంధువులకు నోటీసులు పంపిస్తారు. మరోవైపు తమ న్యాయబద్ధమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాష్ట్రంలో ఏదో ఒక అంశంపై మృతదేహాలను ఉంచే సంఘటనలను అరికట్టడానికి మాత్రమే ప్రభుత్వం చట్టం చేసిందని నిరసనకారులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యాలు, తప్పిదాల కారణంగా చాలాసార్లు కొందరు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి భయపడి ప్రభుత్వం ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?
న్యాయం కోసం మృతదేహాలతో రోడ్లపై నిరసన చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటప్పుడు మానవత్వం మరియు నైతికత గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మరోవైపు బిజెపి రాజ్యసభ ఎంపి కిరోడి లాలా మీనా మాట్లాడుతూ.. మృతదేహాలతో నిరసన చేయడమనేది.. సరైన పద్ధతి కాదన్నారు. చట్టవిరుద్ధమైన కేసులలో మరణించిన పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అందుకు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మృతదేహానికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది.
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..