Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వే....
- ఏపీ, తెలంగాణ మీదుగా రెండు రైళ్లు ప్రకటన....
- 16 చైర్ కార్ కోచ్లతో నడవనున్న రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే వార్తను అందించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ రెండు నూతన ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం కనెక్టివిటీ పెంచడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు.
Also Read:Advance Tax Deadline: అడ్వాన్స్ టాక్స్ లాస్ట్ డేట్ మార్చి 15.. ఎవరు చెల్లించాలి? ఎంత చెల్లించాలి?
Also Read
- Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
అందులో ఒకటి విశాఖపట్నం – కొల్లాం ఎక్స్ప్రెస్ (18501/18502). ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. మార్గమధ్యలో దువ్వాడ స్టేషన్కు ఉదయం 8:50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 5:20 గంటలకు కొల్లాంలో ప్రారంభమై.. గురువారం రాత్రి 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
మరొక ట్రైన్.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్ప్రెస్ (17065/17066). హైదరాబాద్ శివారులోని చర్లపల్లి నుంచి ఈ రైలు మంగళవారం ఉదయం 7:15 గంటలకు బయలుదేరి.. బుధవారం ఉదయం 11:20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు షాలిమార్లో బయలుదేరి.. గురువారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.
Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
నిర్వహణ కారణాల రీత్యా రాజమండ్రి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే కొన్ని రైళ్లను ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ట్రైన్ నంబర్స్ 07524, 17267, 17268 , 07523 సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ-విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. 16 చైర్ కార్ కోచ్లతో నడిచే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పండుగలు, సెలవుల సమయంలో ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికులకు ఊరటనిస్తున్నాయి.
తాజావార్తలు
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!