Cricket Stadium : తెలంగాణలో క్రికెట్కు కొత్త జోష్.. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో క్రికెట్కు కొత్త జోష్ రానుంది. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరుపనుంది. తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం కలుగనుంది. బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్ క్రికెట్కు రూట్ మ్యాప్.. బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ నియామకమయ్యారు. తెలంగాణ క్రికెటర్ల శ్రేయస్సు, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని హెచ్సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ను నియమించేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టు త్వరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నామని, సర్కార్ భూమిస్తే సులభంగా కట్టవచ్చన్నారు.
అంతేకాకుండా.. ‘రెండు, మూడు జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం. టెండర్లు పిలిచి మహబూబ్నగర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్, నిజామాబాద్ స్టేడియంకు చుట్టు ఫెన్సింగ్ వేయనున్నాం. జూలై 8 నుంచి డొమిస్టిక్ సీజన్ ప్రారంభం. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ప్రారంభమవనుంది. అలానే మహిళల లీగ్ క్రికెట్ను కూడా ప్రారంభించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం. ఉప్పల్ స్టేడియంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించే ప్రణాళిక. కొత్త కోచ్లు, అంపైర్లు, గ్రౌండ్స్మెన్, స్కోరర్ల ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నాం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఆడిట్లను ఆమోదించాం. ఇవి బీసీసీఐకి పంపిస్తే, బీసీసీఐ నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఒక కమిటీని వేశాం. ఇందులో అపెక్స్ కౌన్సిల్ నుంచి ఒకరు, ఏజీ నుంచి ఒకరు, ఒక న్యాయవాది ఉంటారు. విచారించి, బిల్లులు చెల్లింపులు చేస్తారు..’ అని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు.
Also Read
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!