Cricket Stadium : తెలంగాణలో క్రికెట్కు కొత్త జోష్.. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో క్రికెట్కు కొత్త జోష్ రానుంది. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరుపనుంది. తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం కలుగనుంది. బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్ క్రికెట్కు రూట్ మ్యాప్.. బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ నియామకమయ్యారు. తెలంగాణ క్రికెటర్ల శ్రేయస్సు, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని హెచ్సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ను నియమించేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టు త్వరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నామని, సర్కార్ భూమిస్తే సులభంగా కట్టవచ్చన్నారు.
అంతేకాకుండా.. ‘రెండు, మూడు జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం. టెండర్లు పిలిచి మహబూబ్నగర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్, నిజామాబాద్ స్టేడియంకు చుట్టు ఫెన్సింగ్ వేయనున్నాం. జూలై 8 నుంచి డొమిస్టిక్ సీజన్ ప్రారంభం. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ప్రారంభమవనుంది. అలానే మహిళల లీగ్ క్రికెట్ను కూడా ప్రారంభించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం. ఉప్పల్ స్టేడియంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించే ప్రణాళిక. కొత్త కోచ్లు, అంపైర్లు, గ్రౌండ్స్మెన్, స్కోరర్ల ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నాం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఆడిట్లను ఆమోదించాం. ఇవి బీసీసీఐకి పంపిస్తే, బీసీసీఐ నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఒక కమిటీని వేశాం. ఇందులో అపెక్స్ కౌన్సిల్ నుంచి ఒకరు, ఏజీ నుంచి ఒకరు, ఒక న్యాయవాది ఉంటారు. విచారించి, బిల్లులు చెల్లింపులు చేస్తారు..’ అని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు.
Also Read
- IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
- Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
- Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
తాజావార్తలు
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
-
Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!