India Vs Pakistan: డాక్యుమెంటరీగా రాబోతున్న ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్’.. ఎక్కడ చూడొచ్చంటే?
- డాక్యుమెంటరీగా రాబోతున్న భారత్ vs పాకిస్థాన్ 'ది గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్'.
- ఫిబ్రవరి 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేది క్రీడాభిమానులకు అసలైన ఉత్కంఠను కలిగించే ఓ సంఘటన. క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లు, సంఘటనలతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ జట్ల మధ్య ఉన్న రైవల్రీపై నెట్ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్” పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన డాక్యుమెంటరీ పోస్టర్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, విరేంద్ర సెహ్వాగ్ పాక్ జట్టుతో తలపడటానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ డాక్యుమెంటరీలో సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ అక్తర్, వాకర్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్ల ప్రసంగాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.
Also Read: Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచువారబ్బాయి
Also Read
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
- BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
ఈ డాక్యుమెంటరీలో ఇరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లు, ఇరువురి మధ్య పోటీ ఎలా మారిందో, దానికి కారణమైన అనేక ఆసక్తికర విషయాలు చూపించనున్నారు. నెట్ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా పోస్ట్లో “రెండు దేశాల మధ్య అద్భుతమైన పోటీ, 160 కోట్ల మంది ఆశలు, భారత్ – పాక్ క్రికెట్ అనుభవాన్ని మరింత ఆస్వాదించండి” అని పేర్కొంది. ఇక మరోవైపు, క్రికెట్ అభిమానుల ఆనందానికి డబుల్ ట్రీట్గా ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ కూడా ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుండటంతో ఈ డాక్యుమెంటరీ అనేక మంది క్రీడాభిమానులకు మరింత ఉత్సహాన్ని తీసుకురానుంది. కేవలం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులకు మాత్రమే కాకుండా అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ట్రీట్ కానుంది.
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!