Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచువారబ్బాయి
- 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు.
- తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన ఆనాధలు.
- సిసిల మీడియాలో విష్ణుపై ప్రసంశలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ పిల్లలతో కలిసి భోగి మంటలు వేయడం, వారికి ఆట వస్తువులు, కొత్త బట్టలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. “120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటాను. ఈ పిల్లలు ఇక నుంచి నా కుటుంబసభ్యులే. పిల్లలతో సంక్రాంతి పండగను జరుపుకోవడం నాకు ఎంతో సంతోషం ఇస్తోంది. వారికి అవసరమైన అన్ని వసతుల్ని అందించేందుకు నేను ప్రయత్నిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, “కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ, నా మంచి పని ఇతరులకు కూడా ఆదర్శంగా మారాలని నేను ఆశిస్తున్నాను. మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి గొప్ప మనసుతో ఈ చిన్నారులను ఆదరిస్తున్నారు. ఇప్పటి నుంచి నేను ఈ సంస్థకు పెద్దన్నగా ఉంటాను” అని చెప్పుకొచ్చారు.
తాను ప్రారంభించిన ఈ మంచి పనిలో అందరి సహకారం కూడా అవసరమని ఆయన పిలుపునిచ్చారు. “అవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది. మీ ప్రాంతంలో ఉన్న అనాథ పిల్లల్ని ఆదరించి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేయండి” అని కోరారు. మంచు విష్ణు చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, సోషల్ మీడియాలో విష్ణుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు విష్ణు చేసిన మంచి పని ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో మంచు విష్ణు తన శ్రేయస్సుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!