Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచువారబ్బాయి
- 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు.
- తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన ఆనాధలు.
- సిసిల మీడియాలో విష్ణుపై ప్రసంశలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ పిల్లలతో కలిసి భోగి మంటలు వేయడం, వారికి ఆట వస్తువులు, కొత్త బట్టలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. “120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటాను. ఈ పిల్లలు ఇక నుంచి నా కుటుంబసభ్యులే. పిల్లలతో సంక్రాంతి పండగను జరుపుకోవడం నాకు ఎంతో సంతోషం ఇస్తోంది. వారికి అవసరమైన అన్ని వసతుల్ని అందించేందుకు నేను ప్రయత్నిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, “కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ, నా మంచి పని ఇతరులకు కూడా ఆదర్శంగా మారాలని నేను ఆశిస్తున్నాను. మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి గొప్ప మనసుతో ఈ చిన్నారులను ఆదరిస్తున్నారు. ఇప్పటి నుంచి నేను ఈ సంస్థకు పెద్దన్నగా ఉంటాను” అని చెప్పుకొచ్చారు.
తాను ప్రారంభించిన ఈ మంచి పనిలో అందరి సహకారం కూడా అవసరమని ఆయన పిలుపునిచ్చారు. “అవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది. మీ ప్రాంతంలో ఉన్న అనాథ పిల్లల్ని ఆదరించి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేయండి” అని కోరారు. మంచు విష్ణు చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, సోషల్ మీడియాలో విష్ణుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు విష్ణు చేసిన మంచి పని ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో మంచు విష్ణు తన శ్రేయస్సుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!