India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
- భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
- ఏడు నెలల నుంచి జరగని సైనిక సమావేశాలు
- సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు. 2020 మేలో లడఖ్లోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇరుదేశాల సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి భారతదేశం, చైనా మధ్య సంబంధాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు జరిగాయి.
Read Also: Iraqi Airways: చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్వేస్ విమానం కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్..
Also Read
తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ప్రారంభించిన కమాండర్-స్థాయి చర్చలు చారిత్రాత్మకంగా శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 21వ రౌండ్ తర్వాత శాంతిని కాపాడేందుకు ఇరుపక్షాల నిబద్ధతను ధృవీకరిస్తూ ప్రకటన చేసినప్పటికీ, వివాదానికి స్పష్టమైన పరిష్కారం లభించలేదు. అయితే అధికారుల మధ్య గ్రౌండ్-లెవల్ రొటీన్ కమ్యూనికేషన్ మార్పిడి జరిగింది. కానీ 2024 ఫిబ్రవరి తర్వాత కమాండర్ స్థాయి చర్చలు జరగలేదు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశాల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఉన్నత స్థాయి సైనిక చర్చలు లేకపోవడం ఆలస్యం వెనుక కారణాలపై ఊహాగానాలకు దారితీసింది.
Read Also: Mumbai Rain: ముంబైలో వర్ష బీభత్సం.. ఓపెన్ డ్రైన్లో పడి మహిళ మృతి
ముఖ్యంగా పెట్రోలింగ్ హక్కులు, ఉపసంహరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రాథమిక పురోగతి ఉన్నప్పటికీ.. చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల.. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇదే విధమైన భావాలను వ్యక్తం చేశారు. సాధించిన పురోగతిని గుర్తిస్తూ.. పెట్రోలింగ్ హక్కులు, పూర్తి స్థాయిని తగ్గించడానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడలేదని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!