Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
- నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు
- హోంమంత్రి సుదన్ గురుంగ్ రాజీనామా..
- చిక్కుల్లో ప్రధాని బాలెన్ షా ప్రభుత్వం
Sudan Gurung: అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే నేపాల్లోని బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ హోంమంత్రి సుదన్ గురుంగ్ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత మధ్య ఆయన బుధవారం తన పదవికీ రాజీనామా చేస్తూ.. ఆ రాజీనామా పత్రాన్ని ప్రధాని బాలెన్ షాకు సమర్పించారు.
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
రాజీనామాకు దారితీసిన కారణాలు ఇవే..
హోంమంత్రి సుదన్ గురుంగ్పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు, మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న దీపక్ భట్టా వంటి వివాదాస్పద వ్యాపారవేత్తల కంపెనీల్లో వాటాలు (షేర్లు) కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడటం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణకు సహకరించేందుకే తాను నైతిక బాధ్యతతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గురుంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అప్పుడే రోడ్లపైకి వస్తున్న జనం..
ప్రధాని బాలెన్ షా పగ్గాలు చేపట్టి కనీసం నెల రోజులు కూడా పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాట్మండు సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ ప్రజల్లో అసంతృప్తికి ప్రధాన కారణం భారత్తో ముడిపడి ఉన్న సరిహద్దు నిబంధనలు అని విశ్లేషకులకు చెబుతున్నారు. భారత్ నుంచి వచ్చే వంద రూపాయల (నేపాలీ రూ.100) కంటే ఎక్కువ విలువైన వస్తువులపై నేపాల్ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం భారత్పై ఆధారపడతారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో జనం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన బాలెన్ షాకు, తన కేబినెట్ మంత్రే అవినీతి ఆరోపణలతో తప్పుకోవడం పెద్ద దెబ్బ. అటు సొంత పార్టీలో అసమ్మతి, ఇటు ప్రజల నిరసనల మధ్య బాలెన్ షా ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?