Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
- నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు
- హోంమంత్రి సుదన్ గురుంగ్ రాజీనామా..
- చిక్కుల్లో ప్రధాని బాలెన్ షా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan Gurung: అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే నేపాల్లోని బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ హోంమంత్రి సుదన్ గురుంగ్ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత మధ్య ఆయన బుధవారం తన పదవికీ రాజీనామా చేస్తూ.. ఆ రాజీనామా పత్రాన్ని ప్రధాని బాలెన్ షాకు సమర్పించారు.
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
రాజీనామాకు దారితీసిన కారణాలు ఇవే..
హోంమంత్రి సుదన్ గురుంగ్పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు, మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న దీపక్ భట్టా వంటి వివాదాస్పద వ్యాపారవేత్తల కంపెనీల్లో వాటాలు (షేర్లు) కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడటం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణకు సహకరించేందుకే తాను నైతిక బాధ్యతతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గురుంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అప్పుడే రోడ్లపైకి వస్తున్న జనం..
ప్రధాని బాలెన్ షా పగ్గాలు చేపట్టి కనీసం నెల రోజులు కూడా పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాట్మండు సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ ప్రజల్లో అసంతృప్తికి ప్రధాన కారణం భారత్తో ముడిపడి ఉన్న సరిహద్దు నిబంధనలు అని విశ్లేషకులకు చెబుతున్నారు. భారత్ నుంచి వచ్చే వంద రూపాయల (నేపాలీ రూ.100) కంటే ఎక్కువ విలువైన వస్తువులపై నేపాల్ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం భారత్పై ఆధారపడతారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో జనం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన బాలెన్ షాకు, తన కేబినెట్ మంత్రే అవినీతి ఆరోపణలతో తప్పుకోవడం పెద్ద దెబ్బ. అటు సొంత పార్టీలో అసమ్మతి, ఇటు ప్రజల నిరసనల మధ్య బాలెన్ షా ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..