Rajasthan Hospitals: రాజస్థాన్లో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం.. నలుగురి రోగుల కాళ్లను కొరికేసిన ఎలుకలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Hospitals: రాజస్థాన్లోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి మధురదాస్ మాథుర్ ఆసుపత్రి ఏర్పాట్ల రహస్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. మానసిక వ్యాధి విభాగంలోని వార్డులో నలుగురు రోగుల కాళ్లను ఎలుకలు కొరికేశాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈసారి కూడా విషయం గుట్టుచప్పుడు కాకుండా చూసినప్పటికీ.. విషయం బయటపడింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వగ్రామంలోని ఆస్పత్రి కావడం విశేషం.
CM YS Jagan: సీఎం జగన్తో శ్రీలంక ప్రతినిధుల భేటీ.. విషయం ఇదే..
Also Read
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
జోధ్పూర్ జిల్లాలోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రిలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అయితే ఆ ఆస్పత్రిలో కొత్త అంతస్తులు నిర్మిస్తున్నా.. మానసిక వ్యాధుల విభాగం భవనం పరిస్థితి అధ్వానంగా ఉంది. దీంతో ఎలుకలు రోగులపైనే ఏం చక్కా ఫుట్ బాల్ ఆడేస్తున్నాయి. ఈ విషయమై రోగులకు వైద్యులకు ఫిర్యాదు చేయగా.. శుభ్రం చేయిస్తానని చెప్పారు. ఈ ఆసుపత్రిలోని వార్డుల్లో పురుగులు, ఎలుకలను నివారించడానికి ఆసుపత్రి పరిపాలన ప్రతి నెలా 27 వేల రూపాయలు ఏజెన్సీకి చెల్లిస్తుంది. వారు సరైన పనులు చేయకపోవడంతో.. నిర్లక్ష్య కారణంగా రోగులు ఎలుకల బారిన పడుతున్నారు. మరోవైపు ఎలుకల ద్వారా ప్లేగు వంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం ఆసుపత్రి పాలకవర్గం సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Health Tips: వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి..ఎందుకంటే?
ఈ సంచలన వార్త జిల్లాలో వ్యాపించడంతో ఒక్కసారిగా పాలనా సిబ్బందిలో కలకలం రేగింది. జిల్లా పరిషత్ సీఈవో అభిషేక్ సురానా హడావుడిగా మధురదాస్ మాథుర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగాన్ని ఆయన పరిశీలించారు. అతని రాక ముందే ఊహించినప్పటికీ.. ఆసుపత్రి యంత్రాంగం వార్డును శుభ్రం చేసింది. కానీ వార్డులో దుర్గంధం వ్యాపించడం.. ఆసుపత్రి ఆవరణలో వ్యాపించిన మురుగునీరు వార్డు సమీపంలో దర్శనమిచ్చింది. దీంతో అక్కడి ఆస్పత్రి సిబ్బంది సీవరేజీ లైన్లు పాతవేనని వాదించారు. త్వరలో కొత్త సీవరేజీ లైన్లు వేస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!