Rajasthan Hospitals: రాజస్థాన్లో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం.. నలుగురి రోగుల కాళ్లను కొరికేసిన ఎలుకలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Hospitals: రాజస్థాన్లోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి మధురదాస్ మాథుర్ ఆసుపత్రి ఏర్పాట్ల రహస్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. మానసిక వ్యాధి విభాగంలోని వార్డులో నలుగురు రోగుల కాళ్లను ఎలుకలు కొరికేశాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈసారి కూడా విషయం గుట్టుచప్పుడు కాకుండా చూసినప్పటికీ.. విషయం బయటపడింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వగ్రామంలోని ఆస్పత్రి కావడం విశేషం.
CM YS Jagan: సీఎం జగన్తో శ్రీలంక ప్రతినిధుల భేటీ.. విషయం ఇదే..
Also Read
జోధ్పూర్ జిల్లాలోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రిలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అయితే ఆ ఆస్పత్రిలో కొత్త అంతస్తులు నిర్మిస్తున్నా.. మానసిక వ్యాధుల విభాగం భవనం పరిస్థితి అధ్వానంగా ఉంది. దీంతో ఎలుకలు రోగులపైనే ఏం చక్కా ఫుట్ బాల్ ఆడేస్తున్నాయి. ఈ విషయమై రోగులకు వైద్యులకు ఫిర్యాదు చేయగా.. శుభ్రం చేయిస్తానని చెప్పారు. ఈ ఆసుపత్రిలోని వార్డుల్లో పురుగులు, ఎలుకలను నివారించడానికి ఆసుపత్రి పరిపాలన ప్రతి నెలా 27 వేల రూపాయలు ఏజెన్సీకి చెల్లిస్తుంది. వారు సరైన పనులు చేయకపోవడంతో.. నిర్లక్ష్య కారణంగా రోగులు ఎలుకల బారిన పడుతున్నారు. మరోవైపు ఎలుకల ద్వారా ప్లేగు వంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం ఆసుపత్రి పాలకవర్గం సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Health Tips: వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి..ఎందుకంటే?
ఈ సంచలన వార్త జిల్లాలో వ్యాపించడంతో ఒక్కసారిగా పాలనా సిబ్బందిలో కలకలం రేగింది. జిల్లా పరిషత్ సీఈవో అభిషేక్ సురానా హడావుడిగా మధురదాస్ మాథుర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగాన్ని ఆయన పరిశీలించారు. అతని రాక ముందే ఊహించినప్పటికీ.. ఆసుపత్రి యంత్రాంగం వార్డును శుభ్రం చేసింది. కానీ వార్డులో దుర్గంధం వ్యాపించడం.. ఆసుపత్రి ఆవరణలో వ్యాపించిన మురుగునీరు వార్డు సమీపంలో దర్శనమిచ్చింది. దీంతో అక్కడి ఆస్పత్రి సిబ్బంది సీవరేజీ లైన్లు పాతవేనని వాదించారు. త్వరలో కొత్త సీవరేజీ లైన్లు వేస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!