NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!
- ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం
- నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు
- స్కోర్స్ తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు
- ముంబై నుంచి సందీప్ షా, సలీం పాటిల్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది.. నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది.. నీట్ స్కోర్ లను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి రూ. 90 లక్షల వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నవీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ ను అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి నీట్ అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. నీట్ యుజి 2025లో తక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థుల మార్కులను తారుమారు
చేయవచ్చని బాధితులకు హామీ ఇచ్చి డబ్బులు వసూలు చేశారు.
READ MORE: Trivikram Srinivas : గురూజీ ముందు జాగ్రత్త.. మిగతా డైరెక్టర్లు నేర్చుకోవాలా..?
Also Read
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
- Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- T20 World Cup: 'కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి'.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
సీబీఐ అధికారుల సమాచారం ప్రకారం.. అధికారులు తల్లిదండ్రులుగా నటిస్తూ నిందితుడు సందీప్ షాను లోయర్ పరేల్లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కలిశారు. ఈ సమావేశంలో షా పలువురి తల్లిదండ్రుల నుంచి రూ.90 లక్షలు డిమాండ్ చేశాడు. బేరసారాలు ఆడి చివరకు ఒక్కో అభ్యర్థికి రూ.87.5 లక్షలకు కుదించారు. NEET-UG 2025 పరీక్షలో అర్హత సాధించడానికి అవసరమయ్యే స్కోర్లను సాధించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారుల సహాయంతో ప్రయత్ని్స్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో తల్లిదండ్రుల రూపంలో ఉన్న సీబీఐ అధికారులు సందీప్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తులో సలీం పటేల్, జావేద్ అలీ పటేల్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం సలీ, సందీప్ షాను అరెస్ట్ చేశారు.
READ MORE: Vijay Rupani: రెండుసార్లు ఫ్లైట్ టికెట్ క్యాన్సల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి..
తాజావార్తలు
-
Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
-
T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
-
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
-
TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?