NEET 2024 : నీట్ పేపర్ లీస్ కేసులో యాక్టివ్ అయిన ఈడీ.. త్వరలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ఛాన్స్
- నీట్ పేపర్ లీకుపై అలర్ట్ అయిన ఈడీ
- త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET 2024 : దేశవ్యాప్తంగా నీట్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. రోజుకో చోట పరీక్ష పై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పై విద్యార్థులు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. ఈ మొత్తం విషయానికి సంబంధించి ఈడీ త్వరలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ పాత కేసుల్లో అరెస్ట్లు చేస్తోందని, వారి నెట్వర్క్లు, మనీలాండరింగ్ లింక్లపై విచారణ జరుపుతోంది.
పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బృందం బీహార్ , గుజరాత్ లలో విడిది చేసింది. సోమవారం పాట్నాలోని బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి సీబీఐ బృందం కూడా చేరుకుంది. అక్కడ పేపర్ లీక్ కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని వాస్తవాలను ఆర్థిక నేరాల విభాగం సీబీఐకి అప్పగించింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారో ఈఓయూ తన విచారణలో కనుగొంది.
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
Read Also:Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ‘మ్యూజిక్ జాతర’ లోడింగ్..
మే 5న నీట్ పేపర్ లీక్లో బీహార్ పోలీసులు మాఫియా, దాని అనుబంధ పాత్రల గురించి సమాచారం ఇస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మే 17న ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. ఆ తర్వాత ఈ కేసులో సిట్ను ఏర్పాటు చేసింది. పాట్నాలో కాలిపోయిన ప్రశ్నపత్రంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ అందించిన ప్రశ్నపత్రం సరైనదని తేలిందని, ఇప్పుడు దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని సిట్ తన విచారణలో పేర్కొంది. ప్రశ్నపత్రం సీరియల్ కోడ్ హజారీబాగ్లోని ఒయాసిస్ స్కూల్కు చెందినదని దర్యాప్తులో తేలింది. హజారీబాగ్లోనే ప్రశ్నపత్రం ప్యాకింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రశ్నపత్రాల కస్టడీ గొలుసును సీబీఐ ఇప్పుడు ట్రేస్ చేస్తోంది. పేపర్ నగరానికి వచ్చినప్పటి నుంచి పరీక్షా కేంద్రానికి చేరే వరకు చైన్ ఆఫ్ కస్టడీ అంటారు.
విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో, నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఐపిసి సెక్షన్ 420, 406, 120 బి కింద సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్టీఏ పేపర్ను సిద్ధం చేసే ప్రక్రియ అత్యంత గోప్యంగా ఉంటుంది. అయినప్పటికీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగా లోపాలను కనుగొని ఏ దశలో పేపర్ను లీక్ చేశారో నిర్ధారించబడుతుంది.
Read Also:Minister Narayana: ఏపీలో అప్పటి నుంచే అన్న క్యాంటీన్లు..(వీడియో)
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!