Neeraj Chopra: గోల్డెన్ బాయ్ ఖాతాలో మరో స్వర్ణ పతకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: నీరజ్ చోప్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి భారత జావెలిన్ చరిత్రను తిరగరాసిన అతను, అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. 2022 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రజత పతకంతో మెరిశాడు. అలాగే పారిస్ ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్ లో వెండి పతకంతో పట్టు ఆ తర్వాత జరిగిన అనేక లీగ్ లలో అనేక మెడల్స్ సాధించాడు.
Read Also:Best Family Cars: మీ కుటుంబ భద్రత కోసం అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ గల కార్స్ లిస్ట్ ఇదే..!
Also Read
ఇక ఈ భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. బెంగళూరులోని శ్రీ కంఠీర్వ స్టేడియం వేదికగా తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ పోటీలో నీరజ్ అద్భుతంగా రాణించాడు. మూడవ రౌండ్లో 86.18 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన అతను, ఈ ఈవెంట్ను విజయవంతంగా గెలుచుకున్నాడు. ఈ త్రోను ఎవరూ అధిగమించలేకపోవడంతో నీరజ్ ను విజేతగా ప్రకటించారు. ఈ పోటీలో కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 మీటర్లతో రెండవ స్థానంలో, శ్రీలంక అథ్లెట్ రమేష్ పతిరాజ్ 84.34 మీటర్ల త్రోతో మూడవ స్థానంలో నిలిచాడు. భారత్కు చెందిన సచిన్ యాదవ్ నాల్గవ స్థానంతో సర్దుకున్నాడు.
Read Also:Motorola Edge 50 Fusion vs Vivo Y39 5G: మిడ్ రేంజ్లో బెస్ట్ ఫోన్ ఏది..? ఎందుకు..?
ఈ స్పోర్టింగ్ ఈవెంట్ను ప్రత్యక్షంగా వీక్షించడానికి 15 వేల మందికి పైగా ప్రేక్షకులు గ్రౌండ్ కు హాజరయ్యారు. గెలిచిన అనంతరం అభిమానులను నీరజ్ కలిశారు. ఇక పోటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్కడ గాలి దిశ త్రోకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఎక్కువ దూరం వెళ్లలేకపోయానని వెల్లడించాడు. అయినప్పటికీ, భారతదేశంలో ఇటువంటి భారీ స్థాయి ఈవెంట్లో పాల్గొనడం తనకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను దేశంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ పోటీలో మొత్తం 12 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారతదేశం నుంచి ఐదుగురు పాల్గొనగా.. కెన్యా, శ్రీలంక, బ్రెజిల్, అమెరికా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్ల నుంచి ఆటగాళ్లు పాల్గొన్నారు. మొదటి మూడు రౌండ్లలో అందరికీ త్రోలు అవకాశమిస్తే, ఆ తరువాత టాప్ ఎనిమిది మంది తదుపరి రౌండ్లకు అర్హులయ్యారు. గరిష్ట దూరం విసిరిన అథ్లెట్కే విజేత స్థానం లభించింది. ఈ పోటీలో ఆసియా క్రీడల పతక విజేత కిషోర్ జెనా, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ గాయాల కారణంగా పాల్గొనలేకపోయారు. అయినప్పటికీ, ఈ పోటీని భారతదేశంలో నిర్వహించడమే ఒక మైలురాయిగా నిలిచింది. నీరజ్ చోప్రా చేసిన ఈ ప్రయత్నం భారత అథ్లెటిక్స్ కు మరింత ఊపునిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Neeraj Chopra shows exactly why he’s a champion! 💥
Brings out his A game in the third round with a massive 86.18m, taking the lead back from Rumesh Pathirage. 🇮🇳The crowd is loving it! 🔥#NCClassic 2025 #GameOfThrows #CraftingVictories #NeerajChopra pic.twitter.com/QPvLFbbIgQ
— Inspire Institute of Sport (@IIS_Vijayanagar) July 5, 2025
తాజావార్తలు
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!