Neeraj Chopra: గోల్డెన్ బాయ్కు అరుదైన గౌరవం.. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా..!
- ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఈ గౌరవం అందచేత
- క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, యువతకు స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ హోదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో నీరజ్ చోప్రా ఈ గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, కోట్లాది మంది యువ భారతీయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ హోదాను అందించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులకు మాత్రమే లభించే ఈ గౌరవ ర్యాంకును అందుకున్న కొద్దిమంది ప్రముఖుల లిస్ట్ లో నీరజ్ కూడా చేరిపోయారు.
నెవ్వర్ బిఫోర్.. రూ.29,000 భారీ డిస్కౌంట్ తో Samsung Galaxy S24 FE 5G మొబైల్ అమ్మకాలు..!
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
ఇకపోతే, ఇండియన్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా (Naib Subedar ర్యాంక్లో) నీరజ్ చోప్రా 2016, ఆగస్టు 26న సైన్యంలో చేరారు. అందిన సమాచారం మేరకు, ఆయనకు ఈ లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా నియామకం ఏప్రిల్ 16 నుంచే అమలులోకి వచ్చింది. జావెలిన్ త్రోలో ఆయన ప్రదర్శనకు గానూ 2018లో అర్జున అవార్డు, 2021లో ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. అదే సంవత్సరం ఆయన సుబేదార్ ర్యాంక్కు పదోన్నతి పొందారు. ఇక టోక్యో 2020 ఒలింపిక్స్లో చారిత్రాత్మక బంగారు పతకం గెలిచిన తర్వాత 27 ఏళ్ల ఈ భారతీయ అథ్లెట్కు భారత సైన్యం 2022లో పరమ విశిష్ట సేవా మెడల్ ను చోప్రాకు ప్రదానం చేశారు అధికారులు. అదే సంవత్సరం ఆయన సుబేదార్ మేజర్ ర్యాంక్కు పదోన్నతి పొందడమే కాక.. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారలలో ఒక్కటైనా పద్మశ్రీని కూడా అందుకున్నారు.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!