Neeraj Chopra: గోల్డెన్ బాయ్కు అరుదైన గౌరవం.. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా..!
- ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఈ గౌరవం అందచేత
- క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, యువతకు స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ హోదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో నీరజ్ చోప్రా ఈ గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, కోట్లాది మంది యువ భారతీయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ హోదాను అందించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులకు మాత్రమే లభించే ఈ గౌరవ ర్యాంకును అందుకున్న కొద్దిమంది ప్రముఖుల లిస్ట్ లో నీరజ్ కూడా చేరిపోయారు.
నెవ్వర్ బిఫోర్.. రూ.29,000 భారీ డిస్కౌంట్ తో Samsung Galaxy S24 FE 5G మొబైల్ అమ్మకాలు..!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఇకపోతే, ఇండియన్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా (Naib Subedar ర్యాంక్లో) నీరజ్ చోప్రా 2016, ఆగస్టు 26న సైన్యంలో చేరారు. అందిన సమాచారం మేరకు, ఆయనకు ఈ లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా నియామకం ఏప్రిల్ 16 నుంచే అమలులోకి వచ్చింది. జావెలిన్ త్రోలో ఆయన ప్రదర్శనకు గానూ 2018లో అర్జున అవార్డు, 2021లో ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. అదే సంవత్సరం ఆయన సుబేదార్ ర్యాంక్కు పదోన్నతి పొందారు. ఇక టోక్యో 2020 ఒలింపిక్స్లో చారిత్రాత్మక బంగారు పతకం గెలిచిన తర్వాత 27 ఏళ్ల ఈ భారతీయ అథ్లెట్కు భారత సైన్యం 2022లో పరమ విశిష్ట సేవా మెడల్ ను చోప్రాకు ప్రదానం చేశారు అధికారులు. అదే సంవత్సరం ఆయన సుబేదార్ మేజర్ ర్యాంక్కు పదోన్నతి పొందడమే కాక.. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారలలో ఒక్కటైనా పద్మశ్రీని కూడా అందుకున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!