Young Voters : రాష్ట్రంలో కొత్తగా 4,76,597 మంది యువ ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు 3.06 కోట్ల మంది ఓటర్లు అర్హులని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించింది. ముసాయిదా ఎన్నికల పాత్రలను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,06,42,333 మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు. రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) ముసాయిదా రోల్ మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 ఆగస్టు 21న ప్రచురితమైందని, ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 19, 2023 వరకు దాఖలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే.. రాష్ట్రంలో ఇప్పుడు 4,76,597 మంది యువ ఓటర్లు (18-19 ఏళ్ల మధ్య వయస్సు గలవారు) రానున్న ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read : Minister Dharmana: మళ్లీ అవకాశమివ్వమంటున్నారు.. 14 ఏళ్లల్లో ఏమీ చేశారు చంద్రబాబు
Also Read
మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం 2వ ప్రత్యేక సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు వికాస్ రాజ్ తెలిపారు. ముసాయిదా జాబితా ప్రకారం, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333 కాగా అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళా ఓటర్లు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జనవరి 1, 2023 అర్హత తేదీగా ఉన్న మునుపటి SSR 2023 ప్రకారం, జనవరి 5, 2023న ప్రచురించబడిన ఫైనల్ రోల్లో 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 8,31,520 మంది చేర్పులు జరిగాయని, రోల్ను నిరంతరం అప్డేట్ చేయడంతో 1,82,183 మంది ఓటర్లను తొలగించామని సీఈవో తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు రానున్నాయి.
Also Read : Shocking Video: డిఫరెంట్గా ట్రై చేద్దామని పెళ్లి డ్రెస్సులో నీటిలోకి దూకింది.. జస్ట్ మిస్ అంతే
తాజావార్తలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!