Indian Passport: గత 11 ఏళ్లలో దాదాపు 70 వేల మంది భారతీయులు తమ పాస్పోర్టులను సరెండర్ చేశారు. వీరిలో 40 శాతం మంది భారతీయులే వారిలో ఎక్కువ గోవాకు చెందిన వారు. రెండో స్థానంలో పంజాబ్ ఉంది. ఆర్టీఐ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2011-2022 మధ్య, గోవా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, చండీగఢ్ పేర్లతో సహా ఎనిమిది రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయాలలో 90 శాతం పాస్పోర్ట్లు సరెండర్ చేయబడ్డాయి.
2011 మరియు అక్టోబర్ 31, 2022 మధ్య 16.21 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ఈ ఏడాది మార్చి 24న విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ పార్లమెంటుకు తెలియజేశారు. పౌరసత్వాన్ని వదులుకోవడంలో గోవా మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత పంజాబ్ పేరు ఉంది. ఆర్టీఐ నివేదికలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం..
Read Also:ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ!
ఏయే రాష్ట్రాల్లో ఎన్ని పాస్పోర్టులు సరెండర్ చేశారు
గోవా – 28, 031 (40.45%)
పంజాబ్- 9557 (13.79%)
గుజరాత్ – 8918 (12.87%)
మహారాష్ట్ర – 6545 (9.44%)
కేరళ-3650 (5.27%)
తమిళనాడు – 2946 (4.25%)
ఢిల్లీ-2842 (4.1%)
ఇతర రాష్ట్రాలు- 6814 (9.83%)
విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, లోక్సభలో సమర్పించిన గణాంకాల ప్రకారం (16.21 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు), ప్రతి సంవత్సరం ప్రతి నెలా 11,422 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. కాగా, ప్రతి నెలా 482 భారతీయ పాస్పోర్టులు ఆర్పీఓ కార్యాలయంలో సరెండర్ అయ్యాయి. 2011లో 239 పాస్పోర్టులు సరెండర్ అయ్యాయి. 2012లో ఈ సంఖ్య 11,492కి పెరిగింది.
Read Also:Russia Ukraine War: యుద్ధంలో దేవుడు రక్షిస్తాడు.. రష్యన్ కమాండర్ భుజాలపై గణేష్, హనుమాన్ పచ్చబొట్లు