Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ms Swaminathan Green Revolution Tribute

MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్

Published Date :August 7, 2025 , 5:11 pm
By Shiva Ganesh
MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

MS Swaminathan Jayanti: ఒక నాడు తిండి గింజలు లేక ఏడ్చిన దగ్గరి నుంచి నేడు వాటిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందంటే దాని వెనక ఉన్న వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్‌. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారిన ఆ మహోన్నత వ్యక్తి కృషి ఫలితమే నేడు మనం తినే తిండి గింజలు. ఎంఎస్ స్వామినాథన్‌‌గా దేశ ప్రజలందరికి సుపరిచతమైన ఆయన అసలు పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయన 7 ఆగస్టు 1925 జన్మించి, 28 సెప్టెంబర్ 2023లో స్వర్గస్థులయ్యారు. నేడు ఆ మహనీయుడి జయంతి. ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుందాం..

READ MORE: Manchu Lakshmi : మంచు లక్ష్మీ యాసపై బన్నీ కూతురు సెటైర్లు..

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది
తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7న స్వామినాథన్ పుట్టారు. వారి తల్లిదండ్రులు జనరల్ సర్జన్ ఎంకే సాంబశివన్-పార్వతి తంగమ్మాళ్ సాంబశివన్. 1951లో ఆయన కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు తన మీనా స్వామినాథన్‌ను కలిశారు. వారికి ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్.
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదని అన్న ప్రజాకవి కాళోజీ వాక్యాలు ఎంఎస్ స్వామినాథన్‌కు అచ్చం సరిపోతాయి. ఆయన తన 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. 1954 ప్రారంభంలో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో తాత్కాలికంగా అసిస్టెంట్ బోటనిస్ట్‌గా ఆయన వృత్తి జీవితం ప్రారంభం అయ్యింది. ఆ తరువాత అక్టోబర్ 1954లో అసిస్టెంట్ సైటోజెనెటిస్ట్‌గా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI)లో చేరారు. భారతదేశంలో డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పుడు భారతదేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడాన్ని స్వామినాథన్ విమర్శించారు.

ఆయన పరిశోధనల కృషి..
బంగాళాదుంపలపై ఆయన చేసిన పరిశోధన చాలా విలువైనది. ఆయన విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో తన పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ సమయంలో, మంచు-నిరోధక బంగాళాదుంపను అభివృద్ధి చేయడంలో పరిశోధనలు జరిపారు. ఆయన పరిశోధనల్లో దిగుబడి, పెరుగుదలను నియంత్రించే జన్యు లక్షణాలు, ఉత్పాదకతను పెంచడంలో ముఖ్యమైన కారకాలు సహా బంగాళాదుంపల జన్యు విశ్లేషణ కీలకమైనవి చెప్తారు. 1950 – 1960 లలో స్వామినాథన్ హెక్సాప్లోయిడ్ గోధుమల సైటోజెనెటిక్స్‌పై ప్రాథమిక పరిశోధనలు చేశారు. స్వామినాథన్ – బోర్లాగ్ అభివృద్ధి చేసిన గోధుమ, బియ్యం రకాలు హరిత విప్లవానికి పునాదిగా నిలిచాయని చరిత్రకారులు పేర్కొన్నారు. మెరుగైన కిరణజన్య సంయోగక్రియ, నీటి వినియోగాన్ని అనుమతించే C 4 కార్బన్ స్థిరీకరణ సామర్థ్యాలతో వరిని పండించే ప్రయత్నాలు IRRIలో స్వామినాథన్ ఆధ్వర్యంలోనే ప్రారంభించబడ్డాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అధిక దిగుబడినిచ్చే బాస్మతి అభివృద్ధిలో స్వామినాథన్ పాత్ర ఉంది.

స్వామినాథన్ అధిరోహించిన పదవులు..
ఎంఎస్ స్వామినాథన్ తన జీవిత కాలంలో అనేకానేక పదవులను అధిరోహించారు. 1961-72 మధ్య కాలంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1972-79 మధ్యకాలంలో ICAR డైరక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. 1979-80లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1980-82 మధ్యకాలంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు (సైన్స్ అండ్ అగ్రికల్చర్)గా, డిప్యూటీ ఛైర్మన్‌గా సేవలందించారు. 1982-88 మధ్యకాలంలో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2004లో దేశంలోని రైతుల ఆత్మహత్యలు, ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీ దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యలు, ఒత్తిళ్లపై అధ్యయనం చేసి 2006లో నివేదిక సిద్ధం చేసింది. సాగు సగటు ఉత్పత్తి వ్యయంలో కనీసం 50% ఉండేలా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని కమిటీ ఈ సందర్భంగా సూచించింది. 1987లో ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ పురస్కారాన్ని అందుకున్నారు. 1988లో ఎం.ఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ (MSSRF)ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఈ సంస్థ వ్యవసాయ పరిశోధనలతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని రైతులకు సాయం చేస్తోంది. భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్.. జపాన్, యూఎస్, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై చేసిన పరిశోధనలు ఎంతో మంది ఆకలి కేకలను దూరం చేశాయి. తిండి గింజలు లేక ఏడ్చిన స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు వాటిని ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఈ రోజు ఎదిగిందంటే కారణం ఆయన కృషి ఫలితమే.

READ MORE: Instagram: యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ 3 కొత్త ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన రీల్స్ ను..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agricultural innovations India
  • Father of Green Revolution
  • Food security India
  • Green Revolution history
  • Green Revolution India

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions