నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను మాస్ డైరెక్టర్ బాబీ తో చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకపై సూర్యదేవర నాగవంశీ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నాడు.దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ ఇటీవల నాగవంశీ అదిరిపోయే అప్డేట్ రివీల్ చేశాడు.
బాలకృష్ణ పాత్ర తో పాటు యాక్షన్ అంశాలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో మ్యాడ్ మూవీ ప్రమోషన్స్లో చెప్పేశాడు. గుంటూరు కారం తర్వాత మా బ్యానర్లో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీస్ లో బాలకృష్ణ, బాబీ సినిమా ఒకటని సూర్యదేవర నాగవంశీ తెలిపారు.. ఈ మధ్య కాలంలో అస్సలు టచ్ చేయని గెటప్, క్యారెక్టరైజేషన్ తో బాలకృష్ణ పాత్ర ఈ సినిమా లో కాస్త డిఫరెంట్గా ఉంటుందని ఆయన తెలిపాడు.అయితే ఈ సినిమా సెకండాఫ్లో 45 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ బ్లాక్ ఎంతో కొత్తగా ఉంటుందని, బోయపాటి శ్రీను కూడా తన సినిమాల్లో టచ్ చేయని యాంగిల్ తో ఈ ఎపిసోడ్స్ సాగుతాయని తెలిపారు.మాస్ హిస్టీరియా ఉన్న హీరో అలాగే మాస్ డైరెక్టర్ కలిసి చేస్తోన్న ఈ సినిమాను ఆడియెన్స్ పూర్తి గా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు.బాలకృష్ణ, బాబీ మూవీపై సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి..