దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయనగరం యువకులతో గ్రూప్ ఏర్పాటు చేశాడు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ ఆదేశాలతో సిరాజ్ అహం సంస్థను ఏర్పాటు చేశాడు. అహం సంస్థ ఏర్పాటు కోసం ఇమ్రాన్ సిరాజ్కు రూ.40 లక్షల నగదును పంపాడు. కాగా.. కోర్టు పేలుళ్లకు కేసులో సిరాజ్, సమీర్ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది.
READ MORE: Bala Veeranjaneya Swamy: ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం.. ఎలాంటి బదిలీలు ఉండవు!
ఈ నేపథ్యంలో సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్, సమీర్ ఫోన్ చాటింగ్స్ రిట్రీవ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కోడ్ భాషలో సిరాజ్, సమీర్ ఛాటింగ్ జరిపారు. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని ఛాటింగ్ లో పేర్కొన్నారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కెమికల్ ల్యాబ్కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు. అంతేకాకుండా.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సిరాజ్ సందేశమిచ్చాడు. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులు నిర్వహిద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఛాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో ఛాటింగ్లో చూపెట్టుకున్నాడు.
READ MORE: Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి ఇంటిని తగులబెట్టిన ఆందోళనకారులు.. ఎందుకంటే?