Artemis 1 Moon Mission: మళ్లీ జాబిలిపైకి.. విజయవంతంగా దూసుకెళ్లిన మానవరహిత ‘ఆర్టెమిస్ 1’
Artemis 1 Moon Mission: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాసా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మానవ రహిత రాకెట్ ఆర్టెమిస్ -1 ఎట్టకేలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి చంద్రునిపైకి ఆర్టెమిస్ ప్రయాణం సాగింది. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ఉదయం 01:47 గంటలకు ప్రయోగించారు. ఆర్టెమిస్కు ఒకదాని వెంట ఒకటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇంధనం లీకేజీతో ఆర్టెమిస్కు సైంటిస్టులు మరమ్మతులు చేశారు.కౌంట్ డౌన్ నిలిపివేసిన నాసా మరమ్మత్తులు పూర్తి చేసింది. ఉదయం 1:04 గంటలకు తెరిచిన రెండు గంటల లాంచ్ విండోలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రయోగం జరిగింది. వాల్వ్ లీక్ కారణంగా ఇంజినీర్లు మంగళవారం రాత్రి కోర్ స్టేజ్లోకి ద్రవ హైడ్రోజన్ ప్రవాహాన్ని పాజ్ చేయవలసి వచ్చింది, అయితే లాంచ్ ప్యాడ్కి పంపిన బృందం గంట తర్వాత సమస్యను పరిష్కరించింది. అనంతరం ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా గతంలో ఆర్టెమిస్ ప్రయోగం రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆర్టెమిస్ -2లో వ్యోమగాములను నాసా పంపనుందని సమాచారం.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
సాంకేతిక కారణాల వల్ల గతంలో రెండు ప్రయోగ ప్రయత్నాలు రద్దు కావడంతో నాసాకు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సెప్టెంబరు చివరలో ఫ్లోరిడాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇయాన్తో సహా వాతావరణ వైఫల్యాల కారణంగా లాంచ్ కూడా ఆలస్యమైంది. రాత్రి రాకెట్ దూసుకెళ్తుందని ప్రకటించడంతో సముద్రతీరంలో సుమారు 100,000 మంది ప్రజలు ప్రయోగాన్ని వీక్షించారు.
తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్కు ఈ ఏడాది డిసెంబర్లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్-1ను ఇవాళ ప్రయోగించారు.
We are going.
For the first time, the @NASA_SLS rocket and @NASA_Orion fly together. #Artemis I begins a new chapter in human lunar exploration. pic.twitter.com/vmC64Qgft9
— NASA (@NASA) November 16, 2022
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో