Narsapuram MPDO: అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి!
- 15న నరసాపురం ఎంపీడీవో అదృశ్యం
- ఏలూరు కాల్వలో ఎంపీడీవో మృతదేహం
- అదృశ్యం వెనక మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narsapuram MPDO Dead Body Found in Eluru Canal పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ వీడింది. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ మృతి చెందారు. ఏలూరు కాల్వలో ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంను పోలీసులు ఈరోజు ఉదయం గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంపీడీవో మృతదేహాన్ని వెలికితీశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహంను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఈ నెల 15న ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయిన విషయం తెలిసిందే.
వెంకటరమణ రావు విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు. జులై 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆరోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి.. తాను బందరులో ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పారు. ఆ తర్వాత వెంకటరమణ ఆచూకీ తెలియలేదు. ఫోన్ కూడా పని చేయలేదు. అర్ధరాత్రి దాటాక నా పుట్టిన రోజైన 16వ తేదీనే.. నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్కు మెసేజ్ పంపారు.
Also Read
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Also Read: Budget 2024-AndhraPradesh: ఏపీకి గుడ్న్యూస్.. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు!
వెంకటరమణ మెసేజ్తో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వెంకటరమణ వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. దాంతో విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయన మొబైల్ సిగ్నల్ను ట్రాక్ చేయగా విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద కట్ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకినట్లు భావించారు. చివరకు ఆయన మృతదేహంను పోలీసులు కనుగొన్నారు. ఎంపీడీవో అదృశ్యం వెనక మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ.లక్షల్లో బకాయిలు ఉండటమే కారణమని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!