Parliament Special session: కీలక నిర్ణయం తీసుకోనున్న మోడీ సర్కార్? రాజకీయాలను షేక్ చేయనున్నారా?
Parliament Special session: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసి మూడు వారాలే అయింది. తిరిగి పార్లమెంట్ సెషన్ డిసెంబరులో ఉండాలి. అయితే సంవత్సరాంతంలో జరగాల్సిన శీతాకాలు కాకుండా మోడీ సర్కార్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇవి ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు నిరవధికంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెషన్ దేని కోసం అన్నది ఆయన చెప్పలేదు. ఎజెండాను ప్రకటించలేదు. అయితే ఈ సెషన్ లో మోదీ సర్కార్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కోసం ఈ ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: MK Stalin: ‘మన్ కీ బాత్’ కు పోటీగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
షెడ్యూలు ప్రకారం డిసెంబరులో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే అక్కడ బీజేపీకి అంత అనుకూల వాతావరణం లేదు. ప్రస్తుతానికి అక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి అనుకూల ఫలితాలు రాకపోతే వాటి ప్రభావం తరువాత వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడే అవకాశం ఉందని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియా కూటమి నేతలు ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దేశంలో కూడా ఇండియా కూటమికి మద్దతు పెరుగుతూ ఉండటంతో ఈ ప్రత్యేక సెషన్ ద్వారా పలు కీలక నిర్ణయాలను ప్రధాని మోడీ తీసుకోనున్నట్లు అర్థం అవుతుంది.
బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలు, ఉన్నతి, చంద్రయాన్ సక్సెస్, పెట్టుబడుల ఇలా పలు విషయాలను పార్లమెంట్ లో వివరించే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. దాంతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలను నిర్వహించునున్న ప్రకటనను కూడా మోడీ సర్కారు చేసే అవకాశం ఉందని, దాని కోసమే ఈ సెషన్ అని పలువురు భావిస్తున్నారు. ఈ సెషన్ లోనే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రకటించి దాని ద్వారా కూడా లాభం పొందాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరికొన్ని రోజుల్లో జరగనున్న సమావేశాలలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో