Monditoka Jaganmohan Rao: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నందిగామ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు. ఇవాళ ఆయన నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ, ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి తనను గెలిపించమని అభ్యర్థిస్తున్నారు. మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు.
Read Also: Perni Nani: కూటమి మేనిఫెస్టోపై పేర్ని నాని సెటైర్లు
మా సంక్షేమ పథకాలు అమలు కాని పథకాలు అని ఎద్దేవా చేశారని.. కానీ మా ముఖ్యమంత్రి వాటిని చేసి చూపించారన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇవే పథకాలు కాపీ కొట్టారని ఆయన విమర్శించారు. గడప గడపకు ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రెండోసారి మరల మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ ఆయనను ప్రశంసిస్తున్నారని అన్నారు. నందిగామ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అందరికి మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు.