Namrata Shirodkar : గౌతమ్ ను చూస్తే గర్వంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ లో మెరిసాడు..మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే.. మరోవైపు సామాజిక సేవ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటాడు మహేష్. ఇప్పటికే ఆయన కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్కు ఆయన కుటుంబసభ్యులు అంతా భాగమయ్యారు. ఇప్పటికే మహేష్ సతీమణి ఎంబీ ఫౌండేషన్ సేవలను దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ కు సంబంధించిన వివరాలను మరియు సేవా కార్యక్రమాలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వుంటారు.
ఇక మహేష్ తనయ సితార ఘట్టమనేని కూడా ఈ ఫౌండేషన్ కు తన వంతు సపోర్ట్ గా నిలుస్తుంది.. ఇటీవల ఆమె చేసిన యాడ్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఈ ఫౌండేషన్ కు ఇచ్చినట్లుగా ఆమె తెలిపింది. అలాగే తన పుట్టినరోజు బహుమతిగా కొందరు స్కూల్ విద్యార్థినీలకు సైకిల్స్ కానుకలుగా ఇచ్చిందట సితార. ఇక ఇప్పుడు మహేష్ తనయుడు గౌతమ్ తండ్రి దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం రెయిన్ బో హాస్పిటల్స్ ను సందర్శించి ఎంబీ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను గౌతమ్ పలకరించాడు. ఆ ఫోటోలను ఎంబీ ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడయా ఖాతాలలో షేర్ చేస్తూ గౌతమ్ ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది అని ఆమె పోస్ట్ చేసారు.ఎంబీ ఫౌండేషన్ లో భాగమైన గౌతమ్ ఆంకాలజి, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటారు..క్యాన్సర్ భారిన పడిన పిల్లలను కలిసి గౌతమ్ వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు. చిరునవ్వులు చిందిస్తున్న పిల్లలను చూసి గౌతమ్ ఎంతో సంతోష పడతారు. వారి అందరికి అండగా నిలిచినందుకు గౌతమ్ కు ధన్యవాదాలు అంటూ ఎంబీ ఫౌండేషన్ గౌతమ్ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
తాజావార్తలు
-
Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
-
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?