Bike Taxi: మాపై దాడులను ఆపండి.. ప్రభుత్వాన్ని కోరిన బైక్ టాక్సీ డ్రైవర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Taxi: బైక్ టాక్సీలపై ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ.. నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్కి చెందిన 110 మంది బైక్ టాక్సీ డ్రైవర్ల బృందం కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు తోపాటు, దసరహళ్లి ఎమ్మెల్యే ఎస్. మునిరాజును గురువారం కలిసింది. వేలాది బైక్ టాక్సీ రైడర్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం, బైక్ టాక్సీలను చట్టబద్ధంగా గుర్తించి, తగిన విధానాలతో హక్కులను నిర్ధారించాలంటూ వినతి పత్రం సమర్పించింది. డ్రైవర్లపై జరుగుతున్న వేధింపులు, స్పష్టతలేని విధానాలు వారిని ఆర్థికంగా అస్తవ్యస్తం చేస్తున్నాయని వారు వాపోయారు.
Read Also: Upendra Kushwaha: నాకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరణభయం ఉంది.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలకు పలు బహిరంగ లేఖలు రాసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని వారు తెలిపారు. ప్రభుత్వం ఇటీవలే గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లును ఆమోదించినప్పటికీ, అదే ప్రభుత్వం వేల మందికి జీవనాధారమైన బైక్ టాక్సీలను నిషేధించే ప్రయత్నం చేస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ 250 నుండి 300 మంది డ్రైవర్లు నాకు ఫోన్ చేస్తున్నారు. వారిని ఎలా ఆదుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి బైక్ టాక్సీలపై విధానం లేకపోవడం వల్ల మేము మా జీవనోపాధిని కోల్పోవాలా? మాకు నిర్బంధం కాదు, నియంత్రణ కావాలని స్పష్టం చేశారు.
Read Also: Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!
ఆటో యూనియన్ల నుంచి వస్తున్న బెదిరింపులపై కూడా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ టాక్సీల నిరసనలను అడ్డుకోవాలంటూ ఒక ఆటో యూనియన్ నేత సభ్యులను ప్రేరేపిస్తున్నారని, బైక్ టాక్సీలకు మద్దతుగా మాట్లాడిన ప్రముఖులు కూడా లక్ష్యంగా మారుతున్నారని పేర్కొన్నారు. ‘గత సంవత్సరం కర్ణాటకలో 8 కోట్లకు పైగా బైక్ టాక్సీ ప్రయాణాలు జరిగాయి. మేము ఉపకారం అడగం. మేము కేవలం చట్టబద్ధంగా, సురక్షితంగా పని చేసే హక్కు అడుగుతున్నాం అని మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!