Bike Taxi: మాపై దాడులను ఆపండి.. ప్రభుత్వాన్ని కోరిన బైక్ టాక్సీ డ్రైవర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Taxi: బైక్ టాక్సీలపై ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ.. నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్కి చెందిన 110 మంది బైక్ టాక్సీ డ్రైవర్ల బృందం కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు తోపాటు, దసరహళ్లి ఎమ్మెల్యే ఎస్. మునిరాజును గురువారం కలిసింది. వేలాది బైక్ టాక్సీ రైడర్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం, బైక్ టాక్సీలను చట్టబద్ధంగా గుర్తించి, తగిన విధానాలతో హక్కులను నిర్ధారించాలంటూ వినతి పత్రం సమర్పించింది. డ్రైవర్లపై జరుగుతున్న వేధింపులు, స్పష్టతలేని విధానాలు వారిని ఆర్థికంగా అస్తవ్యస్తం చేస్తున్నాయని వారు వాపోయారు.
Read Also: Upendra Kushwaha: నాకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరణభయం ఉంది.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలకు పలు బహిరంగ లేఖలు రాసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని వారు తెలిపారు. ప్రభుత్వం ఇటీవలే గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లును ఆమోదించినప్పటికీ, అదే ప్రభుత్వం వేల మందికి జీవనాధారమైన బైక్ టాక్సీలను నిషేధించే ప్రయత్నం చేస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ 250 నుండి 300 మంది డ్రైవర్లు నాకు ఫోన్ చేస్తున్నారు. వారిని ఎలా ఆదుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి బైక్ టాక్సీలపై విధానం లేకపోవడం వల్ల మేము మా జీవనోపాధిని కోల్పోవాలా? మాకు నిర్బంధం కాదు, నియంత్రణ కావాలని స్పష్టం చేశారు.
Read Also: Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!
ఆటో యూనియన్ల నుంచి వస్తున్న బెదిరింపులపై కూడా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ టాక్సీల నిరసనలను అడ్డుకోవాలంటూ ఒక ఆటో యూనియన్ నేత సభ్యులను ప్రేరేపిస్తున్నారని, బైక్ టాక్సీలకు మద్దతుగా మాట్లాడిన ప్రముఖులు కూడా లక్ష్యంగా మారుతున్నారని పేర్కొన్నారు. ‘గత సంవత్సరం కర్ణాటకలో 8 కోట్లకు పైగా బైక్ టాక్సీ ప్రయాణాలు జరిగాయి. మేము ఉపకారం అడగం. మేము కేవలం చట్టబద్ధంగా, సురక్షితంగా పని చేసే హక్కు అడుగుతున్నాం అని మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?