Upendra Kushwaha: నాకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరణభయం ఉంది.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upendra Kushwaha: రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఉపేంద్ర కుష్వాహా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనని చంపుతామని హెచ్చరికలు వచ్చాయని ఆయన వెల్లడించారు. గురువారం రాత్రి అనేక ఫోన్ కాల్స్, టెక్స్ట్ సందేశాల రూపంలో బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చారు. గత రాత్రి 8:52 గంటల నుండి 9:20 గంటల మధ్య రెండు వేర్వేరు మొబైల్ నంబర్ల నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయని.. అలాగే, 10 రోజుల్లో నిన్ను చంపుతాం అంటూ మెసేజ్ కూడా వచ్చిందని తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి తనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్నాడని ఉపేంద్ర కుష్వాహా మీడియాతో పేర్కొన్నారు.
Read Also: Air India flights: ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది..? భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు రద్దు..!
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశానని, వారు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఇది ఒక కీలక భద్రతా అంశం. నేను పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే చర్యలు తీసుకుని, బాధ్యులను అరెస్టు చేయాలని కుష్వాహా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై స్పందించిన కుష్వాహా, ఈ పర్యటన ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేసే విధంగా ఉండబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..
సివాన్ ప్రజలు ప్రధానమంత్రి పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతానికి ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకం సైతం సజావుగానే జరగనుందని తెలిపారు. జూన్ 20న ప్రధాని మోదీ బీహార్, ఒడిశా పర్యటన ప్రారంభించనుండగా.. జూన్ 21న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శుక్రవారం నాడు సివాన్లో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. ‘నమామి గంగే’ ప్రాజెక్టు కింద రూ.1,800 కోట్ల విలువైన ఆరు మలినజల శుద్ధి కేంద్రాలను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అలాగే, రూ.3,000 కోట్ల విలువైన తాగునీటి సరఫరా, పారిశుధ్య, మలినజల శుద్ధి పథకాల శంకుస్థాపన చేయనున్నారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!