Nadendla Manohar: జనసేన ఎప్పుడూ జనం పక్షానే నిలబడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై రాష్ట్ర సదస్సు జరిగింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పాట్లు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదు.ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడండి.జనసేన ఎప్పుడూ జనం పక్షానే నిలబడింది.. నిలబడుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుంది.జగన్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా..?ఆర్డినెన్స్ తేవడం ద్వారా పూర్తిగా అమలైపోతుందా..?ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..?ఎంతమంది ఆర్ధిక ప్రగతి సాధించారు..?ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను పొడిగించడం కాదు.. పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలి.
Read Also: Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో దశాబ్దాలుగా ఉంటూనే ఉన్నాయి.రాజకీయ వ్యవస్థలో ఎవరైనా అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇవ్వకపోతే ఎలా..? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను పూర్తిగా అమలు చేసి, నిధులిస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.అందరికీ వీటిపై అవగాహన కల్పించి, అభిప్రాయాలు పంచుకుకోవాలనే ఈ సదస్సు ఏర్పాటు చేశాం.అన్ని పట్టణాలు, పల్లెల్లో తిరిగి వారి హక్కుల గురించి వివరించాలి.చట్టం అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనాన్ని చెప్పాలి.
జగన్ ప్రభుత్వం అరవై శాతం కూడా నిధులు ఇవ్వకుండా దారి మళ్లించారు. బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు, అధికారాలు కల్పించాలి.ప్రతేడాది నిధుల వినియోగం పై చర్చ జరగాలి, ఆడిట్ చేయాలి.గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకిచ్చే నిధులు లాగేశారు.నేడు ఒకవీధి లైటు పోయినా వేయలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారన్నారు. మన బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే సోషల్ ఆడిట్ అవసరం. ప్రభుత్వ వైఫల్యాలను ను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా ఖాకీలతో కొట్టిస్తున్నారు.అన్యాయం, అక్రమాలను ప్రశ్నించే యువత గొంతు నొక్కాలని చూస్తున్నారు.జగనుకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా సబ్ ప్లాన్ విషయంలో చొరచ చూపాలన్నారు.
Read Also: Bandi Sanjay : పరేడ్ గ్రౌండ్లోనే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!