Nadendla Manohar : మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. టోఫెల్ విషయంలో తప్పులు జరుగుతున్నాయని మేం అలెర్ట్ చేస్తే.. అవగాహన పెంచుకోమని మంత్రి బొత్స మాకేదో చెప్పారన్నారు. మేం టోఫెల్ జరిగిన తప్పిదాలపై ఆధారాలతోనే మాట్లాడుతున్నామని ఆయన వెల్లడంచారు. అసలు మంత్రి బొత్సకు టొఫెల్ విషయంలో ఈటీఎస్ సంస్థతో జరిగిన ఒప్పందం గురించి తెలుసా..? టోఫెల్ పరీక్షల కోసం చేసుకున్న ఒప్పందం 54 పేజీలు ఉన్నాయని మంత్రి బొత్సకు తెలుసా..? అని నాదెంట్ల మనోహర్ ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘ఈటీఎస్ సంస్థతో ఒప్పందంలోని వివరాలను మంత్రి బొత్సకు సీఎంఓ అందించిందా..? టొఫెల్ శిక్షణపై ఈటీఎస్ సంస్ఖతో చేసుకున్న ఒప్పందంలోని అంశాలపై మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేసింది. సీనియర్ మంత్రి అయిన బొత్సను కూడా సీఎంఓ పక్కదారి పట్టించిందనేదే మా అభిప్రాయం. గ్యారెంటీ మినిమమ్ పర్చేజ్ క్లాజ్ కింద 1.06 కోట్ల మంది విద్యార్ధులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ కేవలం 80 వేల మంది విద్యార్థులతోనే టోఫెల్ పరీక్షలు రాయిస్తామని మంత్రి చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి టోఫెల్ పరీక్షల కోసం రూ. 1000 ఖర్చు చేయబోతున్నారు. అసలు మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఎందుకు..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టోఫెల్ పరీక్ష రాస్తారు.
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
అలాంటి పరిస్థితుల్లో మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ పరీక్షలు ఎందుకు..?టోఫెల్ స్కోర్ వాలిడిటి రెండేళ్లు మాత్రమే ఉంటుందని ఈటీఎస్ సంస్థే చెప్పింది. టోఫెల్ శిక్షణ కోసం ఇచ్చే మెటిరీయల్ ఎలా ఉండాలి.. ఎలాంటి పేపర్ వాడాలనే అంశాన్ని కూడా ఈటీఎస్ సంస్థే ఫైనలైజ్ చేసేలా ఈటీఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మేం టొఫెల్ శిక్షణలో తప్పిదాలను ప్రస్తావిస్తే.. మా పార్టీని బొత్స విమర్శిస్తున్నారు. వైసీపీకి అధ్యక్షుడెవరని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.. మంత్రి బొత్స దీనికేమంటారు..? ఎన్నికల సంఘం వేసిన ప్రశ్నల ప్రకారం చూస్తే.. వైసీపీ తాడూ బొంగరం లేని పార్టీ. వైసీపీకి క్రియాశీలక సభ్యులే లేరు.. సభ్యత్వమే లేదు.’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!