Nadendla Manohar : మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. టోఫెల్ విషయంలో తప్పులు జరుగుతున్నాయని మేం అలెర్ట్ చేస్తే.. అవగాహన పెంచుకోమని మంత్రి బొత్స మాకేదో చెప్పారన్నారు. మేం టోఫెల్ జరిగిన తప్పిదాలపై ఆధారాలతోనే మాట్లాడుతున్నామని ఆయన వెల్లడంచారు. అసలు మంత్రి బొత్సకు టొఫెల్ విషయంలో ఈటీఎస్ సంస్థతో జరిగిన ఒప్పందం గురించి తెలుసా..? టోఫెల్ పరీక్షల కోసం చేసుకున్న ఒప్పందం 54 పేజీలు ఉన్నాయని మంత్రి బొత్సకు తెలుసా..? అని నాదెంట్ల మనోహర్ ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘ఈటీఎస్ సంస్థతో ఒప్పందంలోని వివరాలను మంత్రి బొత్సకు సీఎంఓ అందించిందా..? టొఫెల్ శిక్షణపై ఈటీఎస్ సంస్ఖతో చేసుకున్న ఒప్పందంలోని అంశాలపై మంత్రి బొత్సను సీఎంఓ మిస్ లీడ్ చేసింది. సీనియర్ మంత్రి అయిన బొత్సను కూడా సీఎంఓ పక్కదారి పట్టించిందనేదే మా అభిప్రాయం. గ్యారెంటీ మినిమమ్ పర్చేజ్ క్లాజ్ కింద 1.06 కోట్ల మంది విద్యార్ధులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ కేవలం 80 వేల మంది విద్యార్థులతోనే టోఫెల్ పరీక్షలు రాయిస్తామని మంత్రి చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి టోఫెల్ పరీక్షల కోసం రూ. 1000 ఖర్చు చేయబోతున్నారు. అసలు మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఎందుకు..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టోఫెల్ పరీక్ష రాస్తారు.
Also Read
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
అలాంటి పరిస్థితుల్లో మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ పరీక్షలు ఎందుకు..?టోఫెల్ స్కోర్ వాలిడిటి రెండేళ్లు మాత్రమే ఉంటుందని ఈటీఎస్ సంస్థే చెప్పింది. టోఫెల్ శిక్షణ కోసం ఇచ్చే మెటిరీయల్ ఎలా ఉండాలి.. ఎలాంటి పేపర్ వాడాలనే అంశాన్ని కూడా ఈటీఎస్ సంస్థే ఫైనలైజ్ చేసేలా ఈటీఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మేం టొఫెల్ శిక్షణలో తప్పిదాలను ప్రస్తావిస్తే.. మా పార్టీని బొత్స విమర్శిస్తున్నారు. వైసీపీకి అధ్యక్షుడెవరని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.. మంత్రి బొత్స దీనికేమంటారు..? ఎన్నికల సంఘం వేసిన ప్రశ్నల ప్రకారం చూస్తే.. వైసీపీ తాడూ బొంగరం లేని పార్టీ. వైసీపీకి క్రియాశీలక సభ్యులే లేరు.. సభ్యత్వమే లేదు.’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు
తాజావార్తలు
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!