Mysterious Sounds: మిస్టరీ ధ్వనులు, భూకంపం పుకార్లు.. ఆ నగరమంతా భయం భయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mysterious Sounds: మహారాష్ట్రలోని లాతూర్ నగరంలోని తూర్పు భాగంలో మిస్టరీ ధ్వనులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం భూమి లోపల నుంచి శబ్దాలు వస్తుండడంతో స్థానికులు వణికిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ మిస్టరీ శబ్దాలకు కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 10.30 నుంచి 10.45 గంటల మధ్య వివేకానంద చౌక్ సమీపంలో ఈ శబ్దాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నివాసితులలో భయాందోళనలు, భూకంపం పుకార్లు వ్యాపించాయి.లాతూర్ నగరంలోని భూకంప కొలత కేంద్రాలతో పాటు జిల్లాలోని ఔరద్ షాహజ్ని, ఆశివ్ నుంచి జిల్లా విపత్తు నిర్వహణ శాఖ సమాచారం తీసుకున్న తర్వాత కొంతమంది స్థానిక పరిపాలనను అప్రమత్తం చేశారు, అయితే ఎలాంటి భూకంప కార్యకలాపాల గురించి నివేదిక లేదని ఓ అధికారి తెలిపారు. .
విపత్తు నిర్వహణ అధికారి సాకేబ్ ఉస్మానీ బుధవారం మాట్లాడుతూ.. మరఠ్వాడా ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొన్ని శబ్దాలు నివేదించబడ్డాయన్నారు. సెప్టెంబరు 2022లో, లాతూర్ జిల్లాలోని హసోరి, కిల్లారి, పరిసర ప్రాంతాల్లో మూడుసార్లు అలాంటి శబ్దాలు వినిపించాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన జిల్లాలోని నీలంగా తహసీల్లోని నీటూరు-దంగేవాడి ప్రాంతంలో ఇలాంటి శబ్దాలు వినిపించాయని అధికారి తెలిపారు. సెప్టెంబరు 2022లో లాతూర్ జిల్లాలోని హసోరి గ్రామంలో భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో గ్రామస్థులు తొలుత ఆశ్చర్యానికి గురైనప్పటికీ గడిచిన వారానికి పైగా అవి కొనసాగుతుండడంతో వారిలో భయం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో వింత శబ్దాలపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజమ్ నిపుణులకు సమాచారం అందించారు.
Also Read
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
- Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
Read Also: Machu Picchu: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ ‘మచు పిచ్చు’ రీఓపెన్.. సందర్శనకు అనుమతి
ఈ గ్రామానికి 28 కి.మీ దూరంలోనే కిల్లారి అనే ఊరుంది. 1993లో అక్కడ సంభవించిన భారీ భూకంపంలో 9700 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, ప్రస్తుతానికి అక్కడ భూకంప సూచికలు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!