Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈసారి మహారాష్ట్ర వంతైంది. కూటమిలో ఉన్న పార్టీలు ఎలాంటి చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విభేదాలు తలెత్తాయి. తాజాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే.. చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో మహావికాస్ అఘాడీలో చీలికలు బయటపడ్డాయి. శివసేన (యూబీటీ)పై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే… కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎంపీ గంజనన్ కీర్తికర్ కుమారుడు అమోల్కు తాజా జాబితాలో చోటు దక్కింది. ముంబై నార్త్-వెస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ప్రకటన అనంతరం సంజయ్ నిరుపమ్ మీడియాతో మాట్లాడుతూ అమోల్కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. శివసేన(యూబీటీ) కిచిడీ చోర్కు టికెట్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. అలాంటి అభ్యర్థుల కోసం తాము పనిచేయలేమని తేల్చి చెప్పారు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. అయితే తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్రౌత్ తాజాగా ప్రకటించడంతో కూటమిలో అసంతృప్తి జ్వాలలకు దారితీస్తోంది.
ఉద్ధవ్ ఠాక్రే వర్గం అమోల్కు టికెట్ ఇచ్చిన రోజునే.. కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కరోనా కాలంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ స్కామ్ విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Rishabh Pant: బజ్ బాల్ ని ఇంట్రడ్యూస్ చేసింది అతను..ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!
ముంబై సౌత్-సెంట్రల్, సాంగ్లీలో అభ్యర్థులను ప్రకటించడం కాంగ్రెస్కు మరింత కోపం తెప్పించింది. ఎందుకంటే ఆ స్థానాలు గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయినా కూడా వెల్లడించేశారు. ముంబైలోని ఆరు లోక్సభ స్థానాల్లో శివసేన (యూబీటీ) ఐదు స్థానాల్లో పోటీ చేస్తుందని.. ఒక సీటు కాంగ్రెస్కు కేటాయించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ను నాశనం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నిరుపమ్ అభిప్రాయపడ్డారు. నిరుపమ్ వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తప్పుపట్టారు. అతనెవరో మాకు తెలియదన్నారు. మా పార్టీలో క్రమశిక్షణ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: West Bengal: మైనర్ బాలికపై అత్యాచారం.. తృణమూల్ నేత కుమారుడిపై ఆరోపణలు..
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!