Murugha Mutt Seer: మైనర్లపై లైంగిక వేధింపులు.. మురుగ మఠాధిపతికి జ్యుడీషియల్ కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murugha Mutt Seer: మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకలోని మురుగ మఠం ప్రధానార్చకుడు శివమూర్తి మురుగ శరణరును శుక్రవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఆయనను చిత్రదుర్గ జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు రేపు ఓపెన్ కోర్టులో పోలీస్ రిమాండ్ కోరనున్నారు.ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో శరణారావును కర్ణాటక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు కర్ణాటక శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ అలోక్ కుమార్ వెల్లడించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత జిల్లా సెషన్స్ జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరుపరిచామని తెలిపారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని, చిత్రదుర్గ పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పారు.
ర్ణాటక చెందిన ఇద్దరు బాలికలు మైసూరులోని ఒక స్వచ్ఛంద సంస్థ వద్దకు వెళ్లి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి అక్కడి అధికారులకు వివరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మురుగ మఠాధిపతిని అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల మురుగ మఠాధిపతిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు నేపథ్యంలో చిత్రదుర్గలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కుట్రలో భాగమని, తాను చట్టానికి కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తానని మురుగ మఠాధిపతి తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను స్థానిక కోర్టు సెప్టెంబరు 2కు వాయిదా వేసింది.
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
చిత్రదుర్గలోని ప్రభావవంతమైన మురుగ మఠం పీఠాధిపతిపై మైనర్ బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.ఎఫ్ఐఆర్ ప్రకారం, బాలికలు రెండేళ్లుగా వేధింపులకు గురయ్యారు. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్తో కలిసి చిత్రదుర్గలోని మురుగ మఠాన్ని సందర్శించారు. మురుగ మఠం కూడా ఒక ప్రభావవంతమైన సంస్థగా ప్రసిద్ధి చెందింది.
తాజావార్తలు
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!