Muralidhar Rao: వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు అని బీజేపీ ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు.. పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది.. ఎన్నికల ముందు భగవంతుడే అవినీతిని బయటపెట్టాడని అనిపిస్తుంది అని ఆయన తెలిపారు. రుణమాఫీ వడ్డీలకే సరిపడే పరిస్థితి.. పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఒక్క పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయలేదు.. దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బందు హామీ వరకు దగా చేశారు అని మురళీధర్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: SL vs BAN: శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లో అనూహ్య ఘటన
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
2014, 2018మేనిఫెస్టో, ప్రజల మధ్య, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు అని మురళీధర్ రావు పేర్కొన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు.. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ సర్కారు విఫలం అయ్యాయని ఆయన ఆరోపించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు చేపడుతామని వాటిని విస్మరించారు.. సింగరేణిలో నిమ్స్ ను ఏర్పాటు చేస్తామని చేయలేదు.. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆ ఊసే లేదు.. అనేక అంశాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచామని బీజేపీ ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు.
Read Also: Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు..
దేవాలయ భూములు తెలంగాణలో కబ్జా అయినంత దేశంలో ఎక్కడా జరగలేదు అని బీజేపీ నేత మురళీధర్ రావు చెప్పుకొచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు.. తెలంగాణ అంటే లిక్కర్.. లిక్కర్ అంటే తెలంగాణ.. డ్రగ్స్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే డ్రగ్స్ అంటూ ఆరోపించారు. వీటన్నింటకీ కారణం బీఆర్ఎస్ సర్కారు.. ముఖ్యమంత్రి ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో లేరు.. వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదేనని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!