ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఐదుసార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులకు ఆ టీమ్ అంటే ఎంతో పిచ్చి. అలాంటిది గత సీజన్ తమ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అందుకోసమని 2024 సీజన్ పై ముంబై ఇండియన్స్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జట్టులోకి విదేశీ ప్లేయర్లును తీసుకునే ఆలోచనలో ఉంది.
ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్లో వేలం నిర్వహించనున్నారు. అందుకోసం ఐపీఎల్ లో ఆడే జట్లు అందులో పాల్గొననున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ జట్టు ఈ వేలంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవడానికి వ్యూహాలు చేస్తోంది. అయితే వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడిన ఈ ముగ్గురు ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఆ ఆటగాళ్ల ఎవరో తెలుసుకుందాం.
Read Also: Mahua Moitra: మహువా మోయిత్రా వివాదంపై తొలిసారి స్పందించిన దీదీ.. ఆమెకే ప్లస్ అంటూ..
గెరాల్డ్ కోయెట్జీ, దక్షిణాఫ్రికా బౌలర్
ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు జోఫ్రా ఆర్చర్ స్థానంలో కోయెట్జీని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్చర్ ఐపీఎల్ 2023లో అనుకున్నంతగా రాణించలేదు. అంతేకాకుండా.. అతను గాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగా అతని స్థానంలో కోయెట్జీని ముంబై ఇండియన్స్ తీసుకునే అవకాశం ఉంది.
దునిత్ వెల్లలాగే, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్
శ్రీలంక యువ స్పిన్ బౌలర్ దునిత్ వెల్లలాగేపై కూడా ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాఘవ్ గోయల్ స్థానంలో స్పిన్ ఆప్షన్గా దునిత్ వెల్లలాగేను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక.. ముంబై ఇండియన్స్కు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కూడా అవసరం.
పాట్ కమిన్స్, ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్ రౌండర్
ఇటీవల ముగిసిన ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 15 వికెట్లు సాధించాడు. అంతేకాకుండా బ్యాటింగ్ లో కూడా రాణించాడు. ఈ క్రమంలో.. ముంబై ఇండియన్స్కు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అవసరం. అందువల్ల.. వేలంలో కమిన్స్ కోసం ముంబై ఇండియన్స్ భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.