Mudragada Padmanabham: చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు.. వారికి దూరంగా ఉండండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. పేద ప్రజల మనసు ఎరిగిన జగన్మోహన్ రెడ్డి పాలనతోనే వారికి న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలోని రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు కాపులను అనగదొక్కాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కాపుల ద్రోహి పవన్ కల్యాణ్తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: CM YS Jagan: ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం..
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ఇక, చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేశారు ముద్రగడ.. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేసాడని విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధిలేని పనులు చేస్తున్నాడని, ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. దుమ్ము పడకూడదు, దూళిపడకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. చంద్రబాబు, పవన్ వంటి నీచ రాజకీయ నాయకులను ప్రజలు నమ్మరని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పి పేదల మనిషి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కడతారని అన్నారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.
తాజావార్తలు
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!