MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ
- ఐపీఎల్ 2025లో ఆడుతున్న ఎంఎస్ ధోనీ
- కీపర్, బ్యాటర్గా సేవలందిస్తున్న ఎంఎస్ ధోనీ
- ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహీ.. కీపర్, బ్యాటర్గా సేవలందిస్తున్నాడు. తన సహచర ప్లేయర్స్ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారు ఇప్పటికే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 43 ఏళ్ల ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ధోనీ.. తనకు ఎదురైన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. గతంలో భారత జట్టులోని నలుగురు క్రికెటర్లతో మరలా తనకు ఆడాలనుందని తెలిపాడు.
గతంలో భారత జట్టులోని ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ఎంఎస్ ధోనీ సమాధానం ఇచ్చాడు. ‘మళ్లీ అవకాశం వస్తే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నా. సెహ్వాగ్ ఇన్నింగ్స్ను బాగా ఓపెనింగ్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆడడం, ఎలా ఆడాలో నిర్ణయించుకోవడం చాలా కష్టం. అలాంటి సమయాల్లోనూ ఈ నలుగురు ఆటగాళ్లు ఎలా ఆడారో మనం చూశాం. ఒకప్పుడు సెహ్వాగ్, గంగూలీ ఆడుతుంటే బాగుండేది’ అని ధోనీ చెప్పాడు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: MS Dhoni Retirement: ఐపీఎల్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ!
1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్.. 28 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2011లో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అంతకుముందు మహ్మద్ అజారుద్దీన్ (1992, 1996, 1999), సౌరవ్ గంగూలీ (2003), రాహుల్ ద్రవిడ్ (2007)లు కప్ కొట్టడంలో విఫలమయ్యారు. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ను మహీ టీమిండియాకు అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను కూడా ధోనీ ఖాతాలో ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆర్ అశ్విన్ లాంటి దిగ్గజాలు మహీ కెప్టెన్సీలో ఆడారు. అంతేకాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి ప్రస్తుత ప్లేయర్స్ కూడా ఆడారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!