MS Dhoni: ధోనీ ఎందుకిలా చేశావ్?.. పెళ్లి నుంచి రిటైర్మెంట్ వరకు అన్ని షాకింగ్ నిర్ణయాలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఎంఎస్ ధోని మరోసారి అందరికీ షాకిస్తూ కెప్టెన్సీ నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మహీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మహి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎంఎస్ ధోనీ తన జీవితంలోని ప్రతి ప్రధాన నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా ఈ పద్ధతిలోనే తీసుకున్నాడు. క్రికెట్లోకి వచ్చాక కూడా పెద్ద జుట్టుతో శాశ్వతంగా కీపర్ బ్యాట్స్మెన్గా ఆడేందుకు సిద్ధమయ్యాడు. అందరినీ ఆశ్చర్యపరిచే ధోని జీవితంలో ఇలాంటి ఐదు పెద్ద సందర్భాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రహస్యంగా వివాహం
వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ధోని ఇలాంటి రహస్య నిర్ణయాలను తీసుకున్నాడు. జులై 4, 2010న ఎంఎస్ ధోనీ ప్రైవేట్ ఈవెంట్లో సాక్షిని వివాహం చేసుకున్నాడు. కొంత మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు. ఆయనకు ఇప్పుడు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు జీవా. ధోనీ తన జీవితాన్ని చాలా వ్యక్తిగతంగా ఉంచుకుంటాడు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
Read Also: IPL 2024: జడేజా కెప్టెన్గా ఎందుకు ఫ్లాప్ అయ్యాడు?.. కారణం చెప్పిన కోచ్!
ఆకస్మిక రిటైర్మెంట్
2014లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. 35 ఏళ్ల ధోనీ కెరీర్ దూసుకుపోతోంది. అంతా బాగానే ఉంది, కానీ సిరీస్ మధ్యలో, ధోని అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. నాలుగు టెస్టుల సిరీస్లో మూడో మ్యాచ్ ముగిసిన వెంటనే, అతను టెస్టుకు వీడ్కోలు పలికాడు. వైట్ జెర్సీలో మళ్లీ భారత్కు ఆడలేదు.
వన్డే, టీ-20 కెప్టెన్సీని వదులుకున్నాడు..
2017లో ధోని తీసుకున్న మరో షాకింగ్ నిర్ణయాన్ని ప్రపంచం చూసింది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న హఠాత్తుగా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దీని తర్వాత, విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారత కెప్టెన్గా నియమితుడయ్యాడు. తదుపరి ప్రపంచకప్కు సిద్ధమయ్యేందుకు విరాట్కు కేవలం 30 నెలల సమయం మాత్రమే ఉంది.
Read Also: IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో సరికొత్త నిబంధనలు..
రాత్రికి రాత్రే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్
15 ఆగస్టు 2020న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్కు అకస్మాత్తుగా వీడ్కోలు పలికి ధోనీ అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రపంచ కప్ 2019లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్కు ధోనీ ఆడిన చివరి మ్యాచ్ కావడం గమనార్హం. దీని తర్వాత ధోనీ ఎప్పుడూ బ్లూ జెర్సీలో కనిపించలేదు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!