Sanju Samson: ఆ ముగ్గురు ప్లేయర్స్.. నా కొడుకు పదేళ్ల కెరీర్ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి
- శాంసన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
- ఆ ముగ్గురు శాంసన్ కెరీర్ను నాశనం చేశారు
- సంజూకు మంచి క్లాసికల్ టచ్ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తన కొడుకు పదేళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించారు. సంజూ నైపుణ్యాన్ని గుర్తించి జట్టులో అవకాశం ఇచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లకు విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. సంజూ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడని, కొందరు స్వార్థం కోసం ఆడుతారని చెప్పుకొచ్చారు.
2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన సంజూ శాంసన్.. 9 సంవత్సరాలుగా భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ అనంతరం అతడికి జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో సెంచరీ చేసిన సంజూ.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వరుస మ్యాచ్ల్లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై రెండో మ్యాచ్లో డకౌట్ అయినా.. మిగతా రెండు మ్యాచ్ల్లో రాణిస్తాడని అందరూ అంటున్నారు. 2026 టీ20 ప్రపంచకప్లో సంజూ కీలక పాత్ర పోషిస్తాడని అంచనా.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
సంజూ శాంసన్ వరుస మ్యాచ్ల్లో సెంచరీ చేయడంపై అతడి తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వనాథ్ మాట్లాడుతూ… ‘భారత జట్టు మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరైన అవకాశాలు ఇవ్వకుండా నా కొడుకు పదేళ్ల క్రికెట్ కెరీర్ను నాశనం చేశారు. అయినా నా కొడుకు ఏనాడూ బాధపడలేదు. భారత జట్టులో చోటు కోసం ప్రయత్నం చేశాడు. మాజీ ఆటగాడు క్రిష్ శ్రీకాంత్ మాటలు మమ్మల్ని బాధించాయి. బంగ్లాదేశ్ లాంటి సాధారణ జట్టుపై సంజూ సెంచరీ సాధించాడని విమర్శించాడు. ఏ జట్టు మీద చేసినా..సెంచరీ సెంచరీనే. సచిన్, ద్రవిడ్ మాదిరి సంజూకు మంచి క్లాసికల్ టచ్ ఉంది. ప్రోత్సహించకున్నా సరే.. కనీస మర్యాద ఇవ్వకుంటే ఎలా’ అని బాధపడ్డారు.
Also Read: Rohit Sharma: చరిత్రను తిరగరాసిన రోజు.. రోహిత్ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలే!
‘సంజూ శాంసన్కు వరుసగా అవకాశాలు రావడంతో చాలా సంతోషంగా ఉన్నా. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు కృతజ్ఞతలు. ఈ ఇద్దరూ లేకుంటే సంజూను మళ్లీ పక్కనపెట్టేవారు. నా కొడుకు సాధించిన మొదటి శతకాన్ని ఈ ఇద్దరికీ అంకితమివ్వాలనుకుంటున్నా. సంజూ వరుస సెంచరీలు చేయడం ఇలాగే కొనసాగాలి. కొంతమంది స్వార్థం కోసం ఆడుతారు. సంజూ అలా కాదు. భారత జట్టు కోసం నా కొడుకు ఎన్నో సాధిస్తాడనే నమ్మకం ఉంది’ అని శాంసన్ విశ్వనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!