Rohit Sharma: చరిత్రను తిరగరాసిన రోజు.. రోహిత్ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలే!
- 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు
- చరిత్రను తిరగరాసిన రోహిత్
- దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రోహిత్ శర్మ’ పేరు చెప్పగానే ప్రతి క్రికెట్ అభిమానికి అతడి భారీ హిట్టింగే గుర్తుకొస్తుంది. భారీ సిక్సులు బాదే రోహిత్కు ‘హిట్మ్యాన్’ అనే ట్యాగ్ ఉంది. రోహిత్ తన దూకుడైన బ్యాటింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లికించుకున్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అసాధారణమైన రికార్డులను తన పేరిట నమోదు చేశాడు. ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
ఒకప్పుడు వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేయడం ఎవరి వల్ల కాలేదు. సయీద్ అన్వర్, చార్లెస్ కోవెంట్రీలు 194 రన్స్ వద్ద ఆగిపోయారు. 2010లో క్రికెట్ దిద్దజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2011లో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ కొట్టాడు. 2013లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ మొదటి ద్విశతకం (209) చేశాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులను సాధించాడు. శ్రీలంకపైనే 2017లో 208 పరుగులతో అజేయంగా నిలిచి.. మూడో ద్విశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ వన్డేల్లో రోహిత్ పేరిటే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఉంది. కివీస్ మాజీ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 2015లో వెస్టిండీస్ జట్టుపై 234 పరుగులు చేసినా.. రోహిత్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు. వన్డేల్లో ఇప్పటివరకు 12 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు భారత బ్యాటర్లు ఉండడం విశేషం.
Also Read
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
Also Read: IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!
2014లో భారత పర్యటనకు శ్రీలంక వచ్చింది. ఐదు వన్డేల సిరీస్ను భారత్ 5-0 తేడాతో గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ శర్మ చెలరేగాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్లతో ఏకంగా 264 రన్స్ చేశాడు. ఓపెనర్గా వచ్చిన హిట్మ్యాన్.. చివరి బంతికి ఔటై పెవిలియన్కు చేరాడు. రోహిత్ బాదుడుతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 251 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రోహిత్ను వరించింది. హిట్మ్యాన్కు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రూ.2,64,000 చెక్ అందించింది.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!