MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ H-(10)A ని కేటాయించింది. అయితే ఈ స్థలాన్ని కేవలం ‘నివాస అవసరాల’ (Residential Use) కోసం మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం అక్కడ ఒక డయాగ్నస్టిక్ సెంటర్ (నీబర్గ్ పల్స్ డయాగ్నస్టిక్స్) నడుస్తోంది. అంటే ఆ ప్లాట్ ను ‘వాణిజ్య అవసరాల’ (Commercial Use) కోసం వాడుతున్నారని బోర్డు గుర్తించింది. ఇది కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించడమేనని బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
ఈ నోటీసుపై స్పందించేందుకు ధోనీకి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలపరిమితిలోగా సరైన వివరణ ఇవ్వకపోతే.. ఆ ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని బోర్డు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఇలా కేవలం ధోనీకే కాకుండా.. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు జార్ఖండ్ హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు సంజయ్ లాల్ పాశ్వాన్ ధృవీకరించారు.
హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఇంటి గోడలపై ఆయన పేరు, జెర్సీ నంబర్ 7, ఫేమస్ హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్తో కూడిన చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీనిని ఒక సెల్ఫీ పాయింట్లా చూస్తారు. అయితే ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి రాంచీలోని సిమాలియా రింగ్ రోడ్ లో ఉన్న భారీ ఫామ్హౌస్ లో నివసిస్తున్నారు. హర్ములోని ఆస్తి ప్రస్తుతం ఆయన పాత నివాసంగా మాత్రమే ఉంది.
Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రస్తుతం ధోనీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు చివరి ఐపీఎల్ కావచ్చు అని ప్రచారం జరుగుతోంది. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!