MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ H-(10)A ని కేటాయించింది. అయితే ఈ స్థలాన్ని కేవలం ‘నివాస అవసరాల’ (Residential Use) కోసం మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం అక్కడ ఒక డయాగ్నస్టిక్ సెంటర్ (నీబర్గ్ పల్స్ డయాగ్నస్టిక్స్) నడుస్తోంది. అంటే ఆ ప్లాట్ ను ‘వాణిజ్య అవసరాల’ (Commercial Use) కోసం వాడుతున్నారని బోర్డు గుర్తించింది. ఇది కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించడమేనని బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
ఈ నోటీసుపై స్పందించేందుకు ధోనీకి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ కాలపరిమితిలోగా సరైన వివరణ ఇవ్వకపోతే.. ఆ ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని బోర్డు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఇలా కేవలం ధోనీకే కాకుండా.. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు జార్ఖండ్ హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు సంజయ్ లాల్ పాశ్వాన్ ధృవీకరించారు.
హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఇంటి గోడలపై ఆయన పేరు, జెర్సీ నంబర్ 7, ఫేమస్ హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్తో కూడిన చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీనిని ఒక సెల్ఫీ పాయింట్లా చూస్తారు. అయితే ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి రాంచీలోని సిమాలియా రింగ్ రోడ్ లో ఉన్న భారీ ఫామ్హౌస్ లో నివసిస్తున్నారు. హర్ములోని ఆస్తి ప్రస్తుతం ఆయన పాత నివాసంగా మాత్రమే ఉంది.
Huawei MatePad Mini: 8.8-అంగుళాల డిస్ప్లే, 6400mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రస్తుతం ధోనీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు చివరి ఐపీఎల్ కావచ్చు అని ప్రచారం జరుగుతోంది. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!