MP YS Avinash Reddy: చివరి నిమిషంలో సీబీఐ విచారణకు డుమ్మా.. పులివెందులకు అవినాష్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP YS Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది.. ఈ రోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. ఆయన హైదరాబాద్కు రావడంతో.. ఈ రోజు సీబీఐ ముందుకు వస్తారని భావించారు.. ఉదయం 11 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టారు.. ఈ రోజు విచారణకు రాలేను అంటూ సీబీఐకి సమాచారం ఇచ్చిన ఆయన.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది.. దీంతో విచారణకు రాలేకపోతున్నాను.. అని సమాచారం ఇచ్చి.. పులివెందులకు బయల్దేరి వెళ్లారు.. కాగా, పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి.. ఆమె అనారోగ్యంతో ఆందోళనలో ఉన్న అవినాష్ రెడ్డి.. వెంటనే పులివెందులకు బయల్దేరారు.
Read Also: Honeymoon: హనీమూన్లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
మరోవైపు.. గురువారం రోజు ఎంపీ అవినాష్రెడ్డి తరపు లాయర్లు సీబీఐ అధికారులను కలిశారు.. వెకేషన్ బెంచ్లో విచారణ వరకు అవకాశం ఇవ్వాలని కోరారు.. కానీ, దీనికి అంగీకరించలేదు సీబీఐ.. ఇక, ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఎంపీ అవినాష్రెడ్డి.. సీబీఐకి సమాచారం ఇచ్చారు.. కానీ, సీబీఐ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు.. మరోసారి కడప ఎంపీని విచారణకు పిలుస్తారా? లేదా సీబీఐ మరేదైనా స్టెప్ తీసుకోనుందా? అనే చర్చ సాగుతోంది.. కాగా, ఈ రోజు ఉదయం 11 గంటల కంటే ముందు హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయల్దేరారు ఎంపీ అవినాష్రెడ్డి.. అప్పటికే పెద్ద ఎత్తున అవినాష్రెడ్డి అభిమానులు ఆయన ఇంటికి తరలివచ్చారు.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.. అంతా ఆయన సీబీఐ ఆఫీస్కే బయల్దేరి వెళ్తున్నారని భావించారు.. కానీ, ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు బయల్దేరి వెళ్లారు. మరోవైపు, సీబీఐ కార్యాలయం నుంచి రెండు టీమ్లు బయల్దేరి వెళ్లాయి.. ఒక టీమ్ సీబీఐ కోర్టుకు వెళ్లగా.. మరో టీమ్ ఎక్కడికి వెళ్లిందనేది క్లారిటీ లేదు. దీంతో.. వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!