NTV Telugu Site icon

MP Raghunandan Rao : మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్‌లు కొనుక్కోవద్దా

Raghunandan Rao

Raghunandan Rao

మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్‌లు కొనుక్కోవద్దా రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద, కోర్ట్ ల మీద రాహుల్ గాంధీ కి నమ్మకం లేదని, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్త పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు రఘునందర్‌ రావు. అదానీ నీ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించావు అని, వ్యాపారాన్ని విస్తరించాలని రాజీవ్ గాంధీ తనను కోరారు అని అదానీ చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ ను అడ్డం పెట్టుకొని ఏమీ చేద్దామని అనుకుంటున్నారని, భారత షేర్ మార్కెట్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.

  Samantha : ఏటో వెళ్ళిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది.. ఎందుకంటే..?

దేశ ఆర్థిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేయాలని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ తాను బ్రిటిష్ పౌరుడిని అని ఇచ్చిన వివరాలతో సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు… దాని నుండి డైవర్ట్ చేయడానికే రాహుల్ ఇదంతా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బ్లిట్జ్ లో రాహుల్ గాంధీ కి పిల్లలు ఉన్నారని రాశారు.. భార్య ఉందని రాసింది… బ్లిట్జ్ లో వచ్చిన వార్తను ఎందుకు నమ్మడం లేదని, బ్లిట్జ్ లో వచ్చిన దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ఆ ఫోటో లో ఉంది నీ శ్రీమతా కాదా చెప్పు అని రఘునందర్‌ రావు అన్నారు.

 KTR : ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌లకు రక్షణ?