MP Margani Bharat: చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్కి నోట్ల కట్టలు కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.. తప్పిస్తే ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు.. రాజమండ్రిలో. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన సొంత కొడుకు సమర్ధతపై నమ్మకం లేకనే సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన దొందుకు దొందేనని ఎప్పటినుంచో చెబుతూ వచ్చామన్నారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని.. ప్రజల కోసం, అభిమానుల కోసం కాదన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, పవన్ కల్యాణ్కు నోట్ల కట్టలు కావాలంటూ ఆరోపణలు గుప్పించారు.
జనసేన పార్టీ పెట్టిన గత పదీ పదిహేను సంవత్సరాల నుంచి ముసుగేసుకుని రాజకీయాలు చేసిన పవన్ కల్యాణ్ చివరకు చంద్రబాబు భారీ అవినీతి స్కామ్ లో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో.. పవన్ ‘రథసారథి’ పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు భరత్ రామ్. ఇప్పుడు తన ముసుగును పవన్ తొలగించి ‘పొత్తు’ పేరుతో మరో రాజకీయ కుప్పిగంతులకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఇక, టీడీపీ, జనసేన రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితమేమీ ఉండదన్నారు. చంద్రబాబు గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటేనే ప్రజల నుంచి ఎటువంటి స్పందనా, సానుభూతి కనిపించలేదని విమర్శించారు. మొన్న కంబాల చెరువు పార్కు ప్రారంభోత్సవానికి వేలాదిగా జనం వచ్చారు.. అలాగే దేవీ నవరాత్రులకు అత్యంత భక్తిప్రపత్తులతో జనం తరలి వస్తున్నారు.. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్టు అయితే ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
చంద్రబాబు నక్క జిత్తుల రాజకీయాలను అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజల్లో స్పందన, సానుభూతి కనిపించడం లేదన్నారు ఎంపీ భరత్. అలాగే జనసేన పవన్ కల్యాణ్కు రాజకీయ కార్యాచరణ లేదని, కౌలు రైతులు ఓ పదీ పదిహేను మందికి డబ్బులిచ్చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం మద్దతిస్తున్నారని తెలిపారు. ఓటు చాలా విలువైనదని, వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రజలు మరోసారి వైఎస్ జగన్ని సీఎంను చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!