DR.Laxman: ఐదు లక్షల కోట్ల అప్పు.. ఏంటని ప్రశ్నిస్తే అరెస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DR.Laxman: తెలంగాణలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్, లిక్కర్ మాఫియా నడుస్తుందని ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. పల్లెల్లో యుక్త వయసులోనే మహిళలు వితంతువులవుతున్నారని..దీనికి కారణం గ్రామాల్లో మద్యం ఏరులై పారడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన..పటాన్ చెరు (మం) చిన్నకంజర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓట్ల కోసం కొందరు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఓ వర్గం ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. హిందువులను ఎవరైనా కించపరిస్తే ప్రతి ఒక్కరు శివాజీ కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టిన నిజాంను ఓట్ల కోసం కొందరు పొగుడుతున్నారని తెలిపారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: KL Rahul Marriage: నటి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసిన కేఎల్ రాహుల్
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఐదు లక్షల కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి..తన కుటుంబానికి మాత్రం రాజకీయ పదవులు పంచి పెడుతున్నారంటూ మండి పడ్డారు. సబ్బండ కులాలు రోడ్డు మీద పడ్డారు. ఉపాధి లభించడం లేదన్నారు లక్ష్మణ్. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని… ఖాళీ స్థలం ఉంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పి…నేడు ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణంలో వివిధ పార్టీల నుండి బీజేపీ లో చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది యువకులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు లక్ష్మణ్. ఈ సందర్భంగా దేశం మొత్తం మోడీ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీజేపీలో చేరుతున్నారు.. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. .తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!