DR.Laxman: ఐదు లక్షల కోట్ల అప్పు.. ఏంటని ప్రశ్నిస్తే అరెస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DR.Laxman: తెలంగాణలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్, లిక్కర్ మాఫియా నడుస్తుందని ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. పల్లెల్లో యుక్త వయసులోనే మహిళలు వితంతువులవుతున్నారని..దీనికి కారణం గ్రామాల్లో మద్యం ఏరులై పారడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన..పటాన్ చెరు (మం) చిన్నకంజర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓట్ల కోసం కొందరు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఓ వర్గం ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. హిందువులను ఎవరైనా కించపరిస్తే ప్రతి ఒక్కరు శివాజీ కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టిన నిజాంను ఓట్ల కోసం కొందరు పొగుడుతున్నారని తెలిపారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: KL Rahul Marriage: నటి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసిన కేఎల్ రాహుల్
Also Read
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఐదు లక్షల కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి..తన కుటుంబానికి మాత్రం రాజకీయ పదవులు పంచి పెడుతున్నారంటూ మండి పడ్డారు. సబ్బండ కులాలు రోడ్డు మీద పడ్డారు. ఉపాధి లభించడం లేదన్నారు లక్ష్మణ్. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని… ఖాళీ స్థలం ఉంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పి…నేడు ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణంలో వివిధ పార్టీల నుండి బీజేపీ లో చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది యువకులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు లక్ష్మణ్. ఈ సందర్భంగా దేశం మొత్తం మోడీ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీజేపీలో చేరుతున్నారు.. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. .తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!