MP Laxman: భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలి..
- బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్
- హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
- వికసిత భారత్ మోడీ లక్ష్యం- లక్ష్మణ్
- భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలి- లక్ష్మణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మహిళా దినోత్సవ సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూజించే గోవును కూడా గోమాత అంటారని అన్నారు. మహిళల సాధికారతపై ప్రాధాన్యత పెరగాలని చెప్పారు.
Read Also: Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
వికసిత భారత్ మోడీ లక్ష్యం.. అభివృద్ధి చెందిన భారత్గా తీర్చి దిద్దడమే మోడీ విజన్ అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలని అన్నారు. భారత్ ఆర్థిక అభివృద్ధిలో మహిళా అమ్మ పాత్ర పోసించాలన్నదే మోడీ ఆలోచన అని తెలిపారు. 64 కోట్ల మంది హిందువులు కుంభమేళాలో పాల్గొని.. కుహానా మేధావుల కళ్ళు తెరిపించి, సనాతన ధర్మం గురించి చాటి చెప్పారని వెల్లడించారు. సనాతన ధర్మానికి గొప్ప చరిత్ర ఉంది.. పాశ్చాత్య సంస్కృతి వల్ల మన సనాతన సాంప్రదాయాలను మర్చిపోతున్నామని వ్యాఖ్యానించారు. సనాతన సంప్రదాయాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళా మీద ఉందని లక్ష్మణ్ చెప్పారు.
Read Also: Rangareddy: సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి
మహిళా ఆర్థిక అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా, ఆలోచనల పరంగా అభివృద్ధి కావాలి.. దేశానికి రాష్ట్రపతి, ఢిల్లీకి ముఖ్యమంత్రి మహిళేనని అన్నారు. మహిళా బిల్లుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కల్లబొల్లి మాటలు చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారు.. ఇచ్చిన హామీలన్నీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాక్ష్యం అని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతోంది.. తెలంగాణలో మహిళా శక్తితో బీజేపీ అధికారంలోకి రాబోతోంది.. రేవంత్ సర్కార్ ను కూకటి వేళ్ళతో పెకలించడానికి తెలంగాణలో మహిళా శక్తి సిద్ధం కావాలని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!